Vijayawada: నగరంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. దారి మళ్లింపులు, ప్రత్యామ్నాయ మార్గాల వివరాలివే..

రేపు (బుధవారం) విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలో జయహో బీసీ మహాసభ కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా నగరంలో...

Vijayawada: నగరంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. దారి మళ్లింపులు, ప్రత్యామ్నాయ మార్గాల వివరాలివే..
Traffic Restrictions In Vijayawada
Follow us

|

Updated on: Dec 06, 2022 | 5:19 PM

రేపు (బుధవారం) విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలో జయహో బీసీ మహాసభ కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ టీ.కే.రాణా వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం రాకుండా దారి మళ్లిస్తున్నట్లు వెల్లడించారు. బుధవారం ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. బెంజిసర్కిల్‌ నుంచి బందరు రోడ్డు, పోలీస్‌ కంట్రోల్‌ రూం నుంచి బెంజ్ సర్కిల్‌ వైపు, ఐదో నంబర్‌ రూట్, ఏలూరు రోడ్డులోని సీతారామపురం సిగ్నల్‌ నుంచి ఆర్‌టీఏ జంక్షన్‌ వరకు బీసీ మహా సభకు వచ్చే వాహనాలను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. విశాఖపట్నం–చెన్నై హైవేపై హనుమాన్‌జంక్షన్, గుడివాడ, పామర్రు, చల్లపల్లి, రేపల్లె, బాపట్ల, చీరాల, త్రోవగుంట, ఒంగోలు మార్గంలో, హైదరాబాద్‌–విశాఖపట్నం మార్గంలో ఇబ్రహీంపట్నం, జీ.కొండూరు, మైలవరం, నూజివీడు, హనుమాన్‌ జంక్షన్‌ ద్వారా, గుంటూరు–విశాఖపట్నం మార్గంలో ప్రయాణించే వాహనాలు బుడంపాడు, తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు జంక్షన్, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్‌జంక్షన్‌, చెన్నై–హైదరాబాద్‌ మార్గంలో మేదరమెట్ల, అద్దంకి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, నార్కెట్‌పల్లి మీదుగా ప్రయాణాలు చేయాలని అధికారులు సూచించారు.

విజయవాడ నగరంలోనూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. విశాఖపట్నం నుంచి వచ్చే బస్సులు రామవరప్పాడు రింగ్, మహానాడు జంక్షన్, బెంజ్ సర్కిల్‌ ఫ్లై ఓవర్, వారధి జంక్షన్‌ మీదుగా పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌కు చేరుకోవాలి. నెహ్రూ బస్టాండ్‌ నుంచి విశాఖపట్నం వెళ్లే బస్సులు పీసీఆర్‌ జంక్షన్, ప్రకాశం విగ్రహం జంక్షన్, పాత గవర్నమెంట్‌ ఆస్పత్రి, ఏలూరు లాకులు, జీఎస్‌ రాజురోడ్డు, సీతన్నపేట సిగ్నల్, బీఆర్‌టీఎస్‌ రోడ్డు, గుణదల, రామవరప్పాడు మార్గంలో ప్రయాణించాలి. బెంజిసర్కిల్‌ నుంచి బందరు రోడ్డులో ప్రయాణించే వాహనాలు పకీరుగూడెం జంక్షన్, స్క్యూ బ్రిడ్జి, వారధి జంక్షన్‌ మార్గం ద్వారా పీఎన్‌బీఎస్‌కు చేరుకోవాలి.

ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల నుంచి సభకు వచ్చే బస్సులను స్వరాజ్య మైదానంలో.. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల నుంచి సభకు వచ్చే బస్సులను బీఆర్‌టీఎస్‌ రోడ్డులో.. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, నంద్యాల జిల్లాల నుంచి సభకు వచ్చే బస్సులకు సిద్ధార్థ పబ్లిక్‌ స్కూల్‌ మైదానం.. కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి సభకు వచ్చే బస్సులను సిద్ధార్థ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ గ్రౌండ్‌లో నిలపాలని అధికారులు తెలిపారు. వాహనదారులు సహకరించాలని కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..