వ్యవసాయ ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకంపై ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలో ఉచిత విద్యుత్ నగదు బదిలీ పధకాన్ని ఈ నెల నుంచే ప్రారంభిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఈ ఉచిత విద్యుత్ నగదు బదిలీకి.. వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంగా ప్రభుత్వం నామకరణం చేసింది. (YSR Free Agriculture Electricity Scheme)
శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్గా ఈ పధకాన్ని అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉచిత విద్యుత్ సబ్సిడీని ఆ జిల్లా రైతులకు నగదు బదిలీ రూపంలో వచ్చే నెల అందించనున్నట్లు తెలిపింది. కాగా, గతంలోనే ఈ పథకం మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Also Read:
ఏపీ: సచివాలయాల్లో సేవా రుసుములు పెంపు.!
ఏపీ వెళ్లేవారికి గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన బస్సులు.. వివరాలివే..