వివేకా హత్య కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు
వైఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో మంగళగిరి హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వివేకా హత్య కేసుపై రాజకీయ నేతలు ఎవరూ మాట్లాడకూడదని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు ఈ కేసును సీబీఐ కు అప్పగించాలనే పిటిషన్లపై కూడా హైకోర్టులో వాదనలు జరిగాయి. దీనికి సంబంధించిన తదుపరి విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేసింది. ఇక నేతలందరూ కూడా వివేకా హత్యపై మాట్లాడబోమని ఆంగీకారపత్రం ఇవ్వాలని కోర్టు సూచించింది. ఇకపోతే సిట్ విచారణ యధావిధిగా కొనసాగించవచ్చని.. దర్యాప్తు వివరాలు […]
వైఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో మంగళగిరి హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వివేకా హత్య కేసుపై రాజకీయ నేతలు ఎవరూ మాట్లాడకూడదని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు ఈ కేసును సీబీఐ కు అప్పగించాలనే పిటిషన్లపై కూడా హైకోర్టులో వాదనలు జరిగాయి. దీనికి సంబంధించిన తదుపరి విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేసింది. ఇక నేతలందరూ కూడా వివేకా హత్యపై మాట్లాడబోమని ఆంగీకారపత్రం ఇవ్వాలని కోర్టు సూచించింది. ఇకపోతే సిట్ విచారణ యధావిధిగా కొనసాగించవచ్చని.. దర్యాప్తు వివరాలు మాత్రం బహిర్గతం చేయొద్దని హైకోర్టు ఆదేశించింది.