చదువుకున్న శక్తి అలాంటిది : జగన్

|

Sep 08, 2020 | 1:05 PM

ఇంటర్నేషనల్ లిటరసీ డే పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక సందేశం ఇచ్చారు. ఏపీలో వంద శాతం అక్షరాస్యతకు మార్గం సుగమం చేశామని చెప్పారు.

చదువుకున్న శక్తి అలాంటిది : జగన్
Follow us on

ఇంటర్నేషనల్ లిటరసీ డే పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక సందేశం ఇచ్చారు. ఏపీలో వంద శాతం అక్షరాస్యతకు మార్గం సుగమం చేశామని చెప్పారు. విద్యకు ఉన్న గొప్పతనాన్ని ఈ సందర్భంగా ఆయన వెల్లడించే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి తన ట్విట్టర్ అకౌంట్లో స్పందించారు. ‘విద్య జీవితాలను శక్తివంతం చేయగలదు, జీవితాల్ని మార్చగలదు. అంతేకాదు. జీవితాల్నిఉద్ధరించగలదు; పేదరికం, అసమానతలను ఎదుర్కోవడానికి ఇది ఒక ముఖ్యమైన సాధనం. ‘అమ్మ ఒడి’, ‘నాడు-నేడు’, ‘విద్యా దీవన’ వంటి పథకాల ద్వారా తాము ఏపీలో విద్యావ్యవస్థను పునర్నిర్వచించాం. 100% అక్షరాస్యతకు మార్గం సుగమం చేస్తున్నాము.’ అని చెప్పారు ముఖ్యమంత్రి. హ్యాష్ ట్యాగ్ జోడించి #InternationalLiteracyDay అని పేర్కొన్నారు.