Gannavaram Airport: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన ముప్పు.. 117 మంది ప్రయాణీకులతో రన్ వే మీద నిలిచిపోయిన విమానం

| Edited By: Team Veegam

Sep 11, 2021 | 7:52 PM

కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయంలో విమానం నిలిచిపోయింది. ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో రన్ వే మీదే

Gannavaram Airport: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన ముప్పు..  117 మంది ప్రయాణీకులతో రన్ వే మీద నిలిచిపోయిన విమానం
Gannavaram
Follow us on

Air India Plane: కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయంలో విమానం నిలిచిపోయింది. ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో రన్ వే మీదే ఆగిపోయింది. గన్నవరం నుండి 117 మంది ప్రయాణికులతో ఢిల్లీ బయలుదేరిన ఈ ఎయిర్ ఇండియా విమానం గంటల తరబడి రన్ వే మీదే ఉండిన పరిస్థితి ఏర్పడింది. సాంకేతిక కారణాల వల్ల ఈ సమస్య తలెత్తిందని చెప్పిన సిబ్బంది.. టెక్నికల్ టీం సాంకేతిక లోపాన్ని సరిచేస్తోంది.

విమానం ఈ ఉదయం 07.00 గం. లకు ఢిల్లీ నుండి గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్నట్టు సమాచారం. తిరుగు ప్రయాణం సమయంలో సాంకేతిక కారణాల వల్ల రన్ వే మీదే ఆగిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రయాణికులందర్నీ గన్నవరం విమానాశ్రయంలో ఉంచి ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపాన్ని సరిచేస్తున్నారు.

Read also: Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ ఎర్లీ రియాక్షనే ప్రమాదానికి కారణం: ఇంజనీరింగ్ నిపుణులు