గ్రీన్ ఇండియా ఛాలెంజ్: తన కూతురుతో కలిసి మొక్కలు నాటిన రేణు..
ఇప్పుడు ఉన్న జీవన విధానంలో మనందరం అపార్ట్మెంట్ కల్చర్కి అలవాటు పడ్డామని మన చిన్నతనంలో సొంత ఇళ్లల్లో ఉండడంవల్ల ఆ చుట్టు పక్కల అప్పుడప్పుడు మన పెద్ద వాళ్ళు మొక్కలు నాటి పెంచుతూ ఉంటే మనం చూసి నేర్చుకునే వాళ్లం. కానీ ఈ కొత్త తరానికి చెట్లను ఏ విధంగా నాటాలి? పెంచాలనే విషయం...
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా ప్రముఖ యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్ను స్వీకరించి నేడు తన కూతురు, కూతురి స్నేహితురాలితో కలిసి జూబ్లీహిల్స్లోని పార్కులో మొక్కలు నాటారు హీరోయిన్ రేణు దేశాయ్. ఈ సందర్భంగా రేణు దేశాయ్ మాట్లాడుతూ.. ఇప్పుడు ఉన్న జీవన విధానంలో మనందరం అపార్ట్మెంట్ కల్చర్కి అలవాటు పడ్డామని మన చిన్నతనంలో సొంత ఇళ్లల్లో ఉండడంవల్ల ఆ చుట్టు పక్కల అప్పుడప్పుడు మన పెద్ద వాళ్ళు మొక్కలు నాటి పెంచుతూ ఉంటే మనం చూసి నేర్చుకునే వాళ్లం. కానీ ఈ కొత్త తరానికి చెట్లను ఏ విధంగా నాటాలి? పెంచాలనే విషయం తెలియడం లేదు. కాబట్టి గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఉదయభాను నాకిచ్చిన ఛాలెంజ్ స్వీకరించి ఈ రోజు నా కూతురు ఆద్య, తన స్నేహితురాలు యషిక ఇద్దరినీ నేను ఇక్కడికి తీసుకు వచ్చాను. వారి వయసు 10 సంవత్సరాలు వారికి మొక్కలను ఏ విధంగా నాటాలి? మొక్కలు నాటడం వల్ల ఉపయోగం ఏమిటి? అనే విషయాన్ని తెలపటం కోసం వాళ్ళిద్దరినీ తీసుకురావడం జరిగింది.
ఇప్పుడు నాటే మొక్కలు తక్షణమే ఫలితం ఇవ్వకున్నా కూడా ఓ పది, పదిహేను సంవత్సరాల తర్వాత మనం నాటిన మొక్క ఉపయోగం ఉంటుందని తెలిపారు. దాని ఫలాలు భవిష్యత్ తరాల వారు అందుకుంటారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు నా కూతురితో కలిసి మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉంది. నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మరో ముగ్గురికి ఛాలెంజ్ ఇవ్వడం లేదు. ఎందుకంటే ప్రతీ ఒక్కరు కూడా స్వచ్ఛందంగా మొక్కలు నాటాలని కోరుతున్నాను. పర్యావరణాన్ని రక్షించడం మనందరి బాధ్యత అని తెలిపారు రేణు దేశాయ్.