హీరోయిన్ పూర్ణకు బెదిరింపులు.. డబ్బులు ఇవ్వకపోతే..
రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన 'అవును' సినిమాలో నటించిన హీరోయిన్ పూర్ణకు ఈ మధ్య పోకిరీల వేధింపులు ఎదురయ్యాయి. నలుగురు వ్యక్తులు ఫోన్కాల్స్ ద్వారానే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా తమను వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. లాక్డౌన్ కారణంగా మూడు నెలలుగా పూర్ణ తన స్వస్థలం...
రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అవును’ సినిమాలో నటించిన హీరోయిన్ పూర్ణకు ఈ మధ్య పోకిరీల వేధింపులు ఎదురయ్యాయి. నలుగురు వ్యక్తులు ఫోన్కాల్స్ ద్వారానే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా తమను వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. లాక్డౌన్ కారణంగా మూడు నెలలుగా పూర్ణ తన స్వస్థలం అయిన కేరళలో ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడే పలు మలయాళ సినిమాలకు కూడా ఒప్పుకుంది. అంతేకాకుండా ఈ మధ్యనే ఆమె పెళ్లి ఏర్పాట్లలో కూడా ఉన్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే నటి పూర్ణకు కొద్ది రోజులుగా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు, ఫేక్ కాల్స్ వస్తున్నాయి. మాకు లక్ష రూపాయిలు ఇవ్వకపోతే నీ కెరీర్ను నాశనం చేస్తామని బ్లాక్ మెయిల్ కాల్స్ వస్తున్నాయి. అయితే ఇవి ఎక్కడైనా కామన్ అని ఆమె కుటుంబ సభ్యులు సంయమనం పాటించారు. అయినా ఆకతాయిల వేధింపులు తగ్గలేదు. సోషల్ మీడియా పేజ్లలోనూ వారు ఇబ్బందికరంగా పోస్టులను పెడుతుండటంతో.. పూర్ణతో పాటు ఆమె తల్లి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు.. ఆకతాయిల ఫోన్లను ట్రాప్ చేసి వారిని అరెస్ట్ చేశారు. నిందితులు బెంగళూరికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. వీరు శరత్, అష్రఫ్, రఫీజ్, రమేష్గా గుర్తించారు. కాగా ఈ నలుగురు నిందితులు గతంలో కూడా ఇలాంటి పనులకు పాల్పడినట్టుగా పోలీసులు పేర్కొన్నారు. కొంత మంది మహిళలను, స్టూడెంట్స్ని టార్గెట్ చేసి, వారిని వేధించి డబ్బులను డిమాండ్ చేసేవారని పోలీసులు వెల్లడించారు.
Read More:
దారుణ హత్య.. టిఫిన్ బాక్సులో తల.. ఇంటిలో మొండెం..!