పవిత్ర ప్రదేశంలో పూనమ్‌పై అసభ్యకర సన్నివేశాల చిత్రీకరణ.. కేసు నమోదు

లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా సినిమాల షూటింగ్‌లకు అనుమతి రావడంతో.. దాదాపుగా అందరు స్టార్లు ఇళ్లను వీడి సెట్స్ పైకి వెళుతున్నారు.

పవిత్ర ప్రదేశంలో పూనమ్‌పై అసభ్యకర సన్నివేశాల చిత్రీకరణ.. కేసు నమోదు
Follow us

| Edited By:

Updated on: Nov 04, 2020 | 2:04 PM

Poonam in controversy: లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా సినిమాల షూటింగ్‌లకు అనుమతి రావడంతో.. దాదాపుగా అందరు స్టార్లు ఇళ్లను వీడి సెట్స్ పైకి వెళుతున్నారు. ఈ క్రమంలో గోవాలోని ప్రముఖ చాపోలీ డ్యామ్‌ పరిసర ప్రాంతాల్లో జరిగే షూటింగ్‌లో వివాదాస్పద నటి పూనమ్‌ పాండే పాల్గొన్నారు. అక్కడ ఆమెపై కాస్త అసభ్యకరమైన సన్నివేశాలను తెరకెక్కించారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ( ‘ఖుషి’ ఎడిటర్ కోలా భాస్కర్ కన్నుమూత)

ఆ ప్రదేశం మల్లిఖార్జున స్వామి భక్తులకు ఎంతో పవిత్రం కాగా పలువురు పూనమ్‌ చేష్టలపై విమర్శలు గుప్పించారు. ఇక గోవాలోని ప్రతిపక్షనేతలు బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అంత పవిత్రమైన ప్రదేశంలో పోర్నోగ్రఫీ చేసేందుకు అనుమతులు ఎలా ఇచ్చారంటూ కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఆ వీడియోను తెరకెక్కించిన వ్యక్తితో పాటు పూనమ్‌పై కేసు నమోదైంది. పూనమ్‌పై షూటింగ్ చేసిన వ్యక్తిపై కనకోనా పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇక విమెన్స్ వింగ్ పూనమ్‌పై ఫిర్యాదు చేసింది. ( ఛీటింగ్ కేసులో విజయ్‌ నిర్మాతకు మూడేళ్ల జైలు శిక్ష)