భారత ప్రయోజనాలకు ప్రాధాన్యత..

విదేశాలతో జరిగే లావాదేవీల విషయంలో దేశీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తామని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియోకు భారత విదేశాంగ మంత్రి జయశంకర్ స్పష్టం చేశారు. రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న ఎస్-400 క్షిపణుల విషయంలో ఇదే సూత్రం వర్తిస్తుందని ఆయన తెలిపారు. మరోవైపు మైక్ పాంపియో ప్రధాని మోదీని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. భారత్‌తో బంధాన్ని మరింత పటిష్టం చేసుకోవడమే లక్ష్యంగా పర్యటన తలపెట్టిన అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో బుధవారం […]

భారత ప్రయోజనాలకు ప్రాధాన్యత..
Follow us

| Edited By:

Updated on: Jun 27, 2019 | 12:58 PM

విదేశాలతో జరిగే లావాదేవీల విషయంలో దేశీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తామని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియోకు భారత విదేశాంగ మంత్రి జయశంకర్ స్పష్టం చేశారు. రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న ఎస్-400 క్షిపణుల విషయంలో ఇదే సూత్రం వర్తిస్తుందని ఆయన తెలిపారు. మరోవైపు మైక్ పాంపియో ప్రధాని మోదీని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. భారత్‌తో బంధాన్ని మరింత పటిష్టం చేసుకోవడమే లక్ష్యంగా పర్యటన తలపెట్టిన అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో బుధవారం తెల్లవారు జామున ఢిల్లీ చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఆయన మన దేశంలో పర్యటించనున్నారు.