వరల్డ్ ట్రేడ్ సెంటర్లపై ఉగ్రదాడి.. బాప్ రే ! అంతా బీభత్సం !

సరిగ్గా 18 ఏళ్ళ క్రితం..2001 సెప్టెంబరు 11 న అమెరికాలోని ప్రముఖ వరల్డ్ ట్రేడ్ సెంటర్లపై ఉగ్రవాదులు విమానాలతో బాంబుల వర్షం కురిపించారు. ఆ ఘటనలో భారీ ట్విన్ టవర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆ ఘటన తాలూకు ఫోటోలు తాజాగా మరిన్ని రిలీజయ్యాయి. ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకున్న డాక్టర్ ఎమిలీ చిన్ అనే వ్యక్తి అక్కడికి చేరుకున్నాడు. తన కళ్ళముందు జరిగిన ఈ ఘటనను నిశ్చేష్టుడై చూసి అప్పటికప్పుడు కొన్ని […]

వరల్డ్ ట్రేడ్ సెంటర్లపై ఉగ్రదాడి.. బాప్ రే ! అంతా బీభత్సం !

Updated on: Sep 11, 2019 | 5:55 PM

సరిగ్గా 18 ఏళ్ళ క్రితం..2001 సెప్టెంబరు 11 న అమెరికాలోని ప్రముఖ వరల్డ్ ట్రేడ్ సెంటర్లపై ఉగ్రవాదులు విమానాలతో బాంబుల వర్షం కురిపించారు. ఆ ఘటనలో భారీ ట్విన్ టవర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆ ఘటన తాలూకు ఫోటోలు తాజాగా మరిన్ని రిలీజయ్యాయి. ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకున్న డాక్టర్ ఎమిలీ చిన్ అనే వ్యక్తి అక్కడికి చేరుకున్నాడు. తన కళ్ళముందు జరిగిన ఈ ఘటనను నిశ్చేష్టుడై చూసి అప్పటికప్పుడు కొన్ని ఫోటోలు తీస్తూనే భయంతో పరుగులు తీశాడు. అత్యంత భయానకంగా.. మంటల్లో మండుతూ ఆ టవర్స్ కూలిపోయాయి. ఆ నాటి ఘటనలో సుమారు 2,900 మంది మరణించినట్టు అంచనా.. మరెంతో మంది గాయపడ్డారు. ఆ టవర్స్ పై రేగిన మంటలు దాదాపు వంద రోజుల వరకు అలాగే కొనసాగగా.. అగ్నిమాపక సిబ్బంది నిరంతరాయంగా వాటిని ఆర్పేందుకు నానా పాట్లు పడ్డారు. ఇప్పటికీ నాటి ఘటనను తలచుకుని అమెరికా వణికిపోతోంది.


Loading...
Unable to load recommendations.
Follow Us