కరోనా వైరస్ ని కంట్రోల్ చేయగలిగాం.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీలో కరోనా వైరస్ ని కంట్రోల్ చేయగలిగామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ప్రతి వ్యక్తి కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. జూన్ 30 నాటికి నగరంలో 60 వేల యాక్టివ్ కేసులకు గాను లక్ష కేసులు నమోదవుతాయని..
ఢిల్లీలో కరోనా వైరస్ ని కంట్రోల్ చేయగలిగామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ప్రతి వ్యక్తి కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. జూన్ 30 నాటికి నగరంలో 60 వేల యాక్టివ్ కేసులకు గాను లక్ష కేసులు నమోదవుతాయని భావించామని, కానీ ఇవాళ్టికి దాదాపు 26 వేల కేసులు మాత్రమే ఉన్నాయన్నారు. రికవరీ రేటు 67 శాతం ఉందని, నెల క్రితం ఇది 38 శాతమే ఉన్న విషయం గమనార్హమన్నారు. వారం రోజుల్లో పాజిటివ్ కేసులు కూడా తగ్గాయి.. జూన్ 23 న 3,950 కేసులుండగా.. గత 24 గంటల్లోసుమారు రెండు వేల వందకు పైగా నమోదయ్యాయి అని కేజ్రీవాల్ వివరించారు. టెస్టింగ్ ముమ్మరంగా చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపించాయని ఆయన పేర్కొన్నారు. కాగా ఢిల్లీలో మొత్తం 87 వేల కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 2,199 కేసులు నమోదైనట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఐ కేంద్రం సూచనపై ఇకమీదట టెస్టింగులను మరింత పెంచనున్నట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి.