బూడిదగా మారి నది !! ఎందుకో తెలిస్తే షాకే !! వీడియో

|

Dec 26, 2021 | 3:03 PM

విస్పోటనం..ఇండోనేసియాలో పెను బీభత్సం సృష్టించింది. జావా ద్వీపంలో ఉన్న మౌంట్‌ సెమెరు అగ్ని పర్వతం బద్దలైన తర్వాత చుట్టపక్కల కనిపించి దృశ్యాలు భయానకంగా మారాయి..

విస్పోటనం..ఇండోనేసియాలో పెను బీభత్సం సృష్టించింది. జావా ద్వీపంలో ఉన్న మౌంట్‌ సెమెరు అగ్ని పర్వతం బద్దలైన తర్వాత చుట్టపక్కల కనిపించి దృశ్యాలు భయానకంగా మారాయి..భారీ పేలుడుకు అగ్నిపర్వతం నుంచి వెలువడిన బూడిద కిలోమీటర్ల మేర ఆకాశాన్ని కప్పేసింది. లావా, సీరింగ్‌ వాయువు దాదాపు 11 కిలోమీటర్ల మేర వ్యాపించాయి. పర్వతానికి దగ్గర్లోని బెసుక్‌ కొబొకన్‌ నది మొత్తం బూడిద, బురదతో నిండిపోయింది.. చుట్టుపక్కల గ్రామాలన్నీ బూడిదమయమయ్యాయి. ఈ ప్రకృతి విపత్తు ఎంతో మందికి తీరని నష్టాన్ని మిగిల్చింది. ప్రభావిత ప్రాంతాల నుంచి దాదాపు 10 వేల మందిని ఖాళీచేయించారు. సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం !! ఓటర్‌ ఐడీతో ఆధార్‌ నెంబర్‌ లింక్‌ !! వీడియో

Follow us on