ఎక్కడ దాక్కున్నా.. నెతన్యాహును వేటాడి చంపుతాం

Updated on: Mar 17, 2026 | 8:29 PM

ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా కూటమి మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఖమేనీ మరణానికి ప్రతీకారంగా నెతన్యాహును వదలబోమని ఇరాన్ సైన్యం ప్రకటించింది. బాగ్దాద్‌లో అమెరికా రాయబార కార్యాలయంపై, ఖర్గ్ ఐలాండ్‌పై దాడులతో ఉద్రిక్తతలు పెరిగాయి. చమురు కేంద్రాలపై దాడి జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని ఇరాన్ హెచ్చరించింది. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభానికి దారితీయవచ్చని ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా కూటమి మధ్య యుద్ధం అత్యంత భీకర స్థాయికి చేరుకుంది. తమ సుప్రీం లీడర్ ఖమేనీ మరణానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును వదిలిపెట్టబోమని ఇరాన్ సైన్యం శనివారం ప్రకటించింది. అతను ఎక్కడున్నా వెంబడించి, పట్టుకుని, చంపేస్తాం అంటూ టెలిగ్రామ్ వేదికగా చేసిన హెచ్చరికలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. యుద్ధం 16వ రోజుకు చేరుకోగా, బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై క్షిపణి దాడి జరిగింది. ఎంబసీ హెలిప్యాడ్‌పై మిస్సైల్ పడటంతో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. మరోవైపు, ఇరాన్‌లోని కీలకమైన ఖర్గ్ ఐలాండ్‌పై అమెరికా జరిపిన బాంబు దాడులను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. ఇరాన్ సైనిక స్థావరాలను ధ్వంసం చేశామని, హర్మూజ్ జలసంధి రక్షణకు ప్రపంచ దేశాలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇరాన్ ఇప్పటికే ఇజ్రాయెల్‌పై ఐదుసార్లు బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. తమ చమురు క్షేత్రాలపై దాడి జరిగితే, పశ్చిమాసియాలోని అమెరికా అనుబంధ చమురు కేంద్రాలన్నింటినీ బూడిద చేస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరించారు. ఈ ఉద్రిక్తతల వల్ల బహ్రెయిన్, సౌదీ అరేబియాలో జరగాల్సిన ఫార్ములా-1 రేసింగ్‌లు రద్దయ్యాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చమురు సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నో టెన్షన్‌.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల పంపిణీ షురూ

గ్యాస్ కొరత వేళ.. క్రేజీ ఆవిష్కరణతో ఆకలి తీరుస్తున్న టెక్కీలు..

పైకి నిగనిగలాడే క్యాబేజీలు.. లోపల చూస్తే.. వామ్మో

వీడని సంకల్పం: విరిగిన చేత్తోనే పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థి

విమాన ప్రయాణికులకు అలర్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు

Follow Us