ఇజ్రాయెల్ నౌకను ఇలా హైజాక్ చేశారు !! తాజాగా విడుదల చేసిన హూతీ రెబెల్స్
తుర్కియే నుంచి భారత్కు వస్తున్న ఇజ్రాయెల్ కార్గో నౌకను ఎర్రసముద్రంలో హౌతీ రెబెల్స్ హైజాక్ చేసి యెమెన్ తీర ప్రాంతానికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియోను హౌతీ రెబెల్స్ తాజాగా విడుదల చేశారు. కార్గో షిప్ను ఎలా హైజాక్ చేశారో వీడియోలో స్పష్టంగా ఉంది. హెలికాప్టర్లో వచ్చిన రెబెల్స్ ఓడ డెక్పై దిగారు. తర్వాత స్లోగన్స్ చేస్తూ, గాలిలో కాల్పులు జరుపుతూ అక్కడున్నవారిని తమ అదుపులోకి తీసుకున్నారు.
తుర్కియే నుంచి భారత్కు వస్తున్న ఇజ్రాయెల్ కార్గో నౌకను ఎర్రసముద్రంలో హౌతీ రెబెల్స్ హైజాక్ చేసి యెమెన్ తీర ప్రాంతానికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియోను హౌతీ రెబెల్స్ తాజాగా విడుదల చేశారు. కార్గో షిప్ను ఎలా హైజాక్ చేశారో వీడియోలో స్పష్టంగా ఉంది. హెలికాప్టర్లో వచ్చిన రెబెల్స్ ఓడ డెక్పై దిగారు. తర్వాత స్లోగన్స్ చేస్తూ, గాలిలో కాల్పులు జరుపుతూ అక్కడున్నవారిని తమ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఓడను పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చెక్కర్లు కొడుతోంది. హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని ఇప్పటికే హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. ఈ క్రమంలోనే నౌకను హైజాక్ చేశారు. అయితే ఆ నౌకలో తమ దేశానికి చెందిన పౌరులు లేరని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. గెలాక్సీ లీడర్ నౌక ఇజ్రాయెల్ వ్యాపారికి చెందినప్పటికీ ప్రస్తుతం జపాన్కు చెందిన ఓ సంస్థ నిర్వహిస్తోందని అధికారులు గుర్తించారు. ఈ నౌకలో బల్గేరియా, ఫిలిప్పీన్స్, మెక్సికో, ఉక్రెయిన్కు చెందిన 25 మంది సిబ్బంది ఉన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రన్వే నుంచి సముద్రంలోకి విమానం !! చూసి షాక్ తిన్న స్థానికులు
కార్తీక మాసంలో ఏ దీపంతో ఎలాంటి పుణ్యఫలం దక్కుతుంది ??
TOP 9 ET News: పుష్ప2 బిగ్ హింట్ | అప్పుడే 13కోట్లు.. దూసుకుపోతున్న మంగళవారం
మహిళలకేకాదు, పురుషులకూ బస్ ఫ్రీ
లంక రైతుల టెక్ వ్యూహం.. ఇక దొంగల సీన్ సితారే !!
పాట్నా స్టేషన్లో వింత దృశ్యం..ప్లాట్ఫామ్ నిండా పాదముద్రలే
గ్యాస్ బండ చోరీకి ప్లాన్.. కానీ అడ్డంగా బుక్కయ్యాడు
మానవత్వం మరిచిన సంస్థకు.. రూ.210 కోట్ల ఫైన్ వేసిన కోర్టు
రైలులో చిన్నారికి అస్వస్థత.. అప్పుడే ఓ అద్భుతం
ఆరు బ్యాంక్లకు కన్నం వేసిన దొంగ.. చివరికి..

