Telangana: అందరూ గుడిలోకి వెళ్తే.. వీళ్లు గుడియనక్కి వెళ్లారు.. సీన్ కట్ చేస్తే.!
ఇదెక్కడి చోద్యంరా బాబూ.. ప్రతీ ఒక్కరు దేవుడి దర్శనానికి గుడిలోకి వెళ్తే.. వీరు మాత్రం గుడి వెనక్కి వెళ్లారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 10 మంది గుడి వెనక్కి వెళ్లారు.. ఇంతకీ ఎందుకు అని ఆలోచిస్తున్నారా.. ఈ ఘటన మన తెలంగాణలోని ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. మరి ఆ స్టోరీ విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
ములుగు జిల్లాలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. స్థానిక మంగపేట మండలం మల్లూరు గ్రామాంలో ఉన్న హేమాచల లక్ష్మీనరసింహస్వామి గుట్టపై పది మంది వ్యక్తులు ఓ ముఠాగా ఏర్పడి గుప్త నిధుల తవ్వకాలు జరిపారు. గుట్ట పరిసరాల్లో పూజలు నిర్వహించి.. తవ్వకాలు చేశారు. అయితే స్థానికుల సరైన సమయానికి పోలీసులకు సమాచారం అందివ్వడంతో.. వారు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని ముఠాలోని కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఇక గుప్తనిధుల ముఠాలో అటవీ శాఖ సిబ్బంది కూడా ఉండటం గమనార్హం. అభివృద్ధి పనులు చేస్తున్న ఓ ఫారెస్ట్ అధికారితో పాటు అతడి సహాయకునిగా పనిచేస్తున్న వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Follow Us
వైరల్ వీడియోలు
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

