వ్యూస్ కోసం రైలు వస్తుండగా పట్టాలపై నిలబడిన మహిళ.. కట్ చేస్తే
రైల్వే ట్రాక్ల మీద పిచ్చి పిచ్చి పనులు చేసే వారిని రోజూ చూస్తుంటాం. కొందరు వ్యూస్ కోసం ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. మరికొందరు తాము ప్రమాదంలో పడడమే కాకుండా ఎదుటివారిని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. ఇంకొందరు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ప్రయాణికులను ఇబ్బంది పెడుతుంటారు.
ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. రైలు పట్టాలపై ఓ మహిళ చేసిన నిర్వాకానికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘వ్యూస్ కోసం ఇలా ఎవరైనా చేస్తారా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బహెరీ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. సోషల్ మీడియాలో ఎలాగైనా ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో ఓ మహిళ రైలు పట్టాలపైకి వెళ్లింది. చీరను అసభ్యకర రీతిలో ధరించడమే కాకండా, రైలు పట్టాలపై నడుస్తూ వీడియో చేసింది. అంతటితో ఆగని ఆమె.. ఎదురుగా రైలు రావడాన్ని చూసి కూడా అలాగే నడుస్తూ ఉంది. ఈమె చేసిన పనికి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. రైలు పట్టాల నుంచి దూరంగా వెళ్లాలని వారంతా అరుపులు, కేకలు పెడుతున్నా ఆమె మాత్రం పట్టించుకోలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జగన్నాథుడి విగ్రహం ముందు తల వంచి ప్రార్థించిన కోడి..
నదీ పై డ్యామ్ కట్టే ఎలుకలు !! వింతగా ఉందా ?? అయితే ఈ వీడియో ఒక లుక్ వేయండి
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

