బైక్‌పై వెళ్తున్న దంపతులు.. కాటెయ్యకుండానే ప్రాణం తీసిన పాము

సాధారణంగా పాములంటే అందరికీ భయమే.. పాము కనిపిస్తే భయంతో వణికి పోతారు. కొందరు పాము పేరు చెబితే ఆమడదూరం పరుగెడతారు. ఇటీవల పాముకాటుతో అనేకమంది చనిపోతున్నారు. కానీ పాము కాటు వేయకుండానే ప్రాణం పోయింది ఓ మహిళకు బైక్‌పై భర్తతో పాటు వెళ్తున్న మహిళను పాము రూపంలో మృత్యువు వెంటాడింది. పామును తప్పించబోయి బైక్‌తోసహా కాల్వలో పడ్డారు దంపతులు. అలా మహిళ ప్రాణాలు కోల్పోయింది.

బైక్‌పై వెళ్తున్న దంపతులు.. కాటెయ్యకుండానే ప్రాణం తీసిన పాము

|

Updated on: Aug 12, 2024 | 1:26 PM

సాధారణంగా పాములంటే అందరికీ భయమే.. పాము కనిపిస్తే భయంతో వణికి పోతారు. కొందరు పాము పేరు చెబితే ఆమడదూరం పరుగెడతారు. ఇటీవల పాముకాటుతో అనేకమంది చనిపోతున్నారు. కానీ పాము కాటు వేయకుండానే ప్రాణం పోయింది ఓ మహిళకు బైక్‌పై భర్తతో పాటు వెళ్తున్న మహిళను పాము రూపంలో మృత్యువు వెంటాడింది. పామును తప్పించబోయి బైక్‌తోసహా కాల్వలో పడ్డారు దంపతులు. అలా మహిళ ప్రాణాలు కోల్పోయింది. భర్త ఈదుకుంటూ వచ్చి ప్రాణాలతో బయట పడ్డాడు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో జరిగింది. పెందుర్తి ప్రాంతానికి చెందిన కోటిపల్లి నాగేశ్వరరావు.. తన భార్య పాపరత్నంతో కలిసి నర్సీపట్నం వెళ్లారు. అక్కడ పని ముగించుకుని బయలుదేరారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో తిరిగి పెందుర్తికి వెళ్తున్నారు. కొండల అగ్రహారం సమీపంలోకి వచ్చేసరికి ఏలేరు కాలువ పక్క నుంచి ప్రయాణిస్తున్నారు. బైక్ పై వెళుతూ ఉండగా.. వారికి రోడ్డుపై ఓ పాము కనిపించింది. దీంతో కంగారు పడిన నాగేశ్వరరావు పామును తప్పించబోయి, అదుపుతప్పి వాహనంతో సహా భార్య భర్తలు ఇద్దరూ ఏలేరు కాలువలో పడిపోయారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కర్నాటక నుంచి కుంకీ ఏనుగులను తెచ్చే పనిలో ఏపీ డిప్యూటీ సీఎం !! వీటి ప్రత్యేకత ఇదే !!

పెళ్లి గురించి శోభిత ఏం చెప్పిందో తెలుసా ??

సొంతూరిలో.. విద్యార్థులకు అండగా.. నాగ్ అశ్విన్ గొప్ప పని

వయనాడ్ బాధితులకు అండగా ఖైదీ.. జైలు నుంచి 15 కోట్ల సాయం

నన్ను దుబాయ్‌లో అమ్మేస్తాడని భయమేసింది..

Follow us