భయానకం.. ఆ అనుభవం,రైలు టాయిలెట్‌లో లాక్‌ చేసుకున్న మహిళ వీడియో

Updated on: Dec 14, 2025 | 5:10 PM

జానకి ఎక్స్‌ప్రెస్‌లో ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళకు భయానక అనుభవం ఎదురైంది. కతిహార్ జంక్షన్ వద్ద 30-40 మంది యువకులు కోచ్‌లోకి దూసుకురావడంతో ఆమె వాష్‌రూమ్‌లో లాక్‌ చేసుకుంది. రైల్వే హెల్ప్‌లైన్‌కు కాల్ చేయగా, ఆర్పీఎఫ్ సిబ్బంది ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటన రైలు ప్రయాణ భద్రతపై ఆందోళనలు రేకెత్తించింది.

రైలులో ఒంటరిగా ప్రయాణించే మహిళలకు భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. బీహార్‌లోని కతిహార్ జంక్షన్ వద్ద జానకి ఎక్స్‌ప్రెస్ బోగీలో జరిగిన ఒక భయానక సంఘటనతో ఈ విషయం రుజువైంది. ఒక మహిళా ప్రయాణికురాలు రైలు వాష్‌రూమ్‌లో తనను తాను లాక్ చేసుకుంది. ఈ ఘటన కతిహార్ జంక్షన్ వద్ద జరిగింది. సుమారు 30 నుంచి 40 మంది యువకులు అరుస్తూ, ఒకరినొకరు తోసుకుంటూ అక్రమంగా రైలు కోచ్‌లోకి దూసుకొచ్చారు. ఈ గందరగోళ పరిస్థితులతో భయపడిన ఆ మహిళ, అప్పటికి వాష్‌రూమ్‌లో ఉండటంతో వెంటనే లోపలి నుంచి తలుపు వేసుకుంది. బయట జనం కేకలు వేస్తూ, వాష్‌రూమ్ తలుపులు కొట్టడంతో ఆమె తీవ్ర భయాందోళనకు గురైంది.

మరిన్ని వీడియోల కోసం :

పాక్‌లో సంస్కృతం కోర్సు వీడియో

రైల్వే సంచలన నిర్ణయం వీడియో

మెస్సీ కోసం హనీమూన్‌ వాయిదా.. కొత్త పెళ్లికూతురి క్రేజీ ప్లకార్డ్‌ వీడియో

వర్క్‌ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యువల్స్‌ను మళ్లీ తీసుకురండి వీడియో

Loading...
Unable to load recommendations.
Follow Us