చిరుతకు మేకను ఎరగా వేసిన అధికారులు..నెక్ట్స్ సీన్ చూస్తే నవ్వాగదు వీడియో
ఇటీవల కాలంలో చిరుతలు బెడద ఎక్కువైపోయింది. అడవుల్లో ఆహారం దొరక్క జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో చిరుతను బంధించేందుకు అటవీ అధికారులు మేకను ఎరగా ఉంచి చిరుతకోసం బోను ఏర్పాటు చేశారు. మర్నాడు బోనులో చిరుతపడిందేమోనని చెక్ చేయడానికి వచ్చిన అధికారులు అందులో ఉన్నది చూసి షాకయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్ జిల్లా ఫఖర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమ్రి దెహ గ్రామంలో ఇటీవలే చిరుత దాడిలో శాంతి దేవి అనే వృద్ధురాలు మరణించింది. దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు, ఆ చిరుతను పట్టుకోవడానికి గ్రామానికి సమీపంలో ఒక బోనును ఏర్పాటు చేసి, అందులో మేకను ఎరగా కట్టారు. నవంబరు 27 గురువారం రాత్రి ప్రదీప్ అనే స్థానిక వ్యక్తి మద్యం సేవించి ఇంటికి వెళ్తున్న క్రమంలో అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోనును చూశాడు. బోను వద్దకు వెళ్లి అందులో ఉన్న మేకను దొంగిలించాలనుకున్నాడు. మేకను పట్టుకునేందుకు బోను లోపలికి వెళ్లగా ఆటోమేటిక్ డోర్ ఒక్కసారిగా మూసుకుపోయింది. దీంతో అతను మేకతో పాటు లోపలే చిక్కుకుపోయాడు. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేక, తన మొబైల్ ఫోన్ ద్వారా గ్రామస్థులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. సమాచారం అందుకున్న గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమచారం ఇవ్వగా..వారు పోలీసులను వెంటపెట్టుకొని ఘటనా స్థలానికి చేరుకుని అతన్ని సురక్షితంగా బయటకు తీశారు.
మరిన్ని వీడియోల కోసం :
