Viral Video: దుబాయ్‌లో మనోళ్ళకు తగిలిన రూ. 20 కోట్ల లాటరీ! వీడియో

|

Oct 09, 2021 | 9:57 AM

దుబాయ్‌లోని హైపర్‌మార్కెట్‌లో పనిచేస్తున్న 40 మంది బృందానికి 20.26కోట్ల రూపాయల విలువైన లాటరీ తగిలింది. వీరిలో ఇద్దరు బంగ్లాదేశీయులు కాగా మిగిలిన అందరూ భారతీయులే.

దుబాయ్‌లోని హైపర్‌మార్కెట్‌లో పనిచేస్తున్న 40 మంది బృందానికి 20.26కోట్ల రూపాయల విలువైన లాటరీ తగిలింది. వీరిలో ఇద్దరు బంగ్లాదేశీయులు కాగా మిగిలిన అందరూ భారతీయులే. ఒకే గదిలో నివసిస్తున్న వీరందరూ కలిసి కేరళకు చెందిన నహీల్‌ నిజాముద్దీన్‌ పేరుతో లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశారు. అయితే కరోనా నేపథ్యంలో నహీల్‌ నిజాముద్దీన్‌ను కేరళకు పంపించారు. దీంతో లాటరీ నిర్వాహకులు నహీల్‌ను సంప్రదించలేకపోయారని ఖలీజ్‌టైమ్స్‌ పత్రిక తెలిపింది. నహీల్‌ ఇచ్చిన తల్లిదండ్రుల ఫోన్‌ నంబరు ఆధారంగా లాటరీ గెల్చుకున్న విషయాన్ని నిర్వాహకులు తెలియజేశారు. లాటరీ ద్వారా లభించిన మొత్తాన్ని 40 మంది పంచుకోనున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: ల‌ఖింపూర్ ఖేరిలో రైతుల పైకి దూసుకెళ్లిన కారు.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

ల‌ఖింపూర్ ఖేరిలో రైతుల పైకి దూసుకెళ్లిన కారు.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

Follow us on