జూలో సందడి చేస్తున్న తెల్లపులి పిల్లలు

|

Jan 10, 2024 | 9:17 PM

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం భిలాయ్‌లోని మైత్రిబాగ్‌ జూలో తెల్లపులి పిల్లలు సందడి చేస్తున్నాయి. భద్రతా కారణాల రీత్యా నాలుగు నెలలుగా తల్లికి దూరంగా ఉన్న పులి పిల్లలు ఇప్పుడు తిరిగి తల్లితో కలిశాయి. భారీ ఎన్‌క్లోజర్‌లో తల్లితో కలిసి ఆటలాడుతూ జూకు వచ్చే సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. మైత్రిబాగ్‌ జూలో రోమా అనే తెల్ల పులి నాలుగు నెలల క్రితం రెండు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే భద్రతా కారణాల రీత్యా పుట్టగానే వాటిని డార్క్‌ రూమ్‌కి తరలించి సరంక్షించారు జూ నిర్వాహకులు.

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం భిలాయ్‌లోని మైత్రిబాగ్‌ జూలో తెల్లపులి పిల్లలు సందడి చేస్తున్నాయి. భద్రతా కారణాల రీత్యా నాలుగు నెలలుగా తల్లికి దూరంగా ఉన్న పులి పిల్లలు ఇప్పుడు తిరిగి తల్లితో కలిశాయి. భారీ ఎన్‌క్లోజర్‌లో తల్లితో కలిసి ఆటలాడుతూ జూకు వచ్చే సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. మైత్రిబాగ్‌ జూలో రోమా అనే తెల్ల పులి నాలుగు నెలల క్రితం రెండు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే భద్రతా కారణాల రీత్యా పుట్టగానే వాటిని డార్క్‌ రూమ్‌కి తరలించి సరంక్షించారు జూ నిర్వాహకులు. ఇప్పుడు అవి పెద్దవి కావడంతో తల్లితో కలిపి ఒక పెద్ద ఎన్‌క్లోజర్‌లో వేశారు. ముద్దు ముద్దుగా ఉన్న ఆ పులికూనల ఆటలు చూసి సందర్శకులు మురిసిపోతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నడుస్తున్న రైల్లో చలిమంట వేసుకున్న ప్రయాణికులు !! పొగలు రావడంతో ??

Follow us on