చైనాపై ఆంక్షలు.. ఆ పార్సిళ్లు కూడా బంద్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మామూలోళ్లు కాదు. అన్నంత పని చేసేశారు. ఒకేసారి మూడు దేశాలపై టారీఫ్ ను వేసి అందరీకి షాకిచ్చారు. కెనడా, మెక్సికన్ దిగుమతులపై 25 శాతం, చైనా నుంచి వచ్చే వస్తువులపై 10 శాతం సుంకం విధించారు. మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్ అనే నినాదంతో అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ తాజా నిర్ణయంతో అగ్రరాజ్య ఆర్థిక వృద్ధి పెరుగుదలపై దృష్టి పెట్టారు.
తాజాగా చైనా, హాంకాంగ్ల నుంచి వచ్చే పార్శిళ్లను తాత్కాలికంగా నిలిపివేసింది అమెరికా పోస్టల్ సర్వీస్. ముందునుంచీ హెచ్చరిస్తున్నట్టుగానే ట్రంప్ తమ పొరుగుదేశాలైన మెక్సికో, కెనడాలతోపాటు చైనా పైనా సుంకాల కొరడా ఝళిపించారు. చైనా అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది. చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై 10% సుంకం విధిస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేయగా.. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్లపై 15 శాతం సుంకాలు విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. ఇతర దేశాలను సుంకాల పేరుతో ప్రతిసారీ బెదిరించకుండా, ఫెంటానిల్ లాంటి సమస్యలను సొంతంగా పరిష్కరించుకోవాలని అమెరికాకు చైనా హితవు పలికింది. చమురు, వ్యవసాయ పరికరాలపై ఆ టారిఫ్ 10 శాతం ఉంటుందని స్పష్టం చేసింది.
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం
మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !
ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి
దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్ చెప్పిందిలా..
తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్ చేస్తే..
అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే

