తవ్వకాల్లో బయటపడిన పురాతన పెట్టె !! ఓపెన్‌ చేసి చూడగా కళ్లు జిగేల్‌..

Updated on: Jun 21, 2022 | 9:40 AM

ఈ ప్రపంచం ఎన్నో రహస్యాలతో నిండి ఉంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పురావస్తు శాస్త్రవేత్తలు తమ పరిశోధనలతో ఎన్నో విషయాలను వెలుగులోకి తెచ్చారు.

ఈ ప్రపంచం ఎన్నో రహస్యాలతో నిండి ఉంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పురావస్తు శాస్త్రవేత్తలు తమ పరిశోధనలతో ఎన్నో విషయాలను వెలుగులోకి తెచ్చారు. తాజాగా ఓ దేశంలో 4వేల సంవత్సరాల నాటి చారిత్రక నిధిని కనిపెట్టారు. ఎంతో విలువైన ఆ సంపదను ఓ విచిత్రమైన ఆకారంలో ఉన్న పెట్టేలో పెట్టి, బలి గుంటలో పాతిపెట్టినట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. చైనీస్ మీడియా నివేదికల ప్రకారం, పురావస్తు శాస్త్రవేత్తలు తాబేలు షెల్‌ను పోలి ఉండే ఓ పెట్టెలో భారీ నిధిని కనుగొన్నారు. ఈ పెట్టెను 6 బలి గుంటలలో పాతిపెట్టారు. ఈ నిధిలో బంగారం, కంచు, పచ్చతో తయారు చేసిన వస్తువులు ఉన్నట్టుగా గుర్తించారు. ఇవి శాంక్సింగ్‌డుయ్ (Sanxingdui) సంస్కృతి గురించి చాలా సమాచారాన్ని అందించగలదని ఈ బృందం చెబుతోంది. ఈ నిధి కనుగొనబడిన శాంక్సింగ్‌డుయ్ శిధిలాలు సిచువాన్ ప్రావిన్స్‌లో ఉన్నాయి. ఇక్కడ త్రవ్వకాలలో, బూడిద కందకాలు, నిర్మాణ పునాదులు, చిన్న బలి గుంటలు, సాంస్కృతిక అవశేషాలు అలాగే వెదురు, రెల్లు, సోయాబీన్లు, పశువులు మరియు అడవి పందుల అవశేషాలను కనుగొన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫాదర్స్ డే సందర్భంగా.. తండ్రితో మెగాస్టార్‌ జ్ఞాపకాలు

వీరావేశంతో.. స్టేజ్‌ పై డ్యాన్స్ ఇరగదీసిన ఆర్జీవీ.. మైకల్ జాక్సన్ మరిపించాడు అంటున్న ఫ్యాన్స్

రోడ్డు పక్కన పడిఉన్న డెడ్ బాడీ ?? భయపడిన జనాలు !! దగ్గరకెళ్లి చూడగా మైండ్ బ్లాంక్

Prakash Raj : సాయి పల్లవి వివరణపై స్పందించిన మోనార్క్‌..

Published on: Jun 21, 2022 09:40 AM
Loading...
Unable to load recommendations.
Follow Us