ఉత్తరప్రదేశ్లో అనుమాష సంఘటన వెలుగులోకి వచ్చింది. మూగ జీవి పట్ల కర్కశంగా ప్రవర్తించారు దుండగులు. ముగ్గురు వ్యక్తులు కుక్క మెడకు ఉరి వేసి గోడకు వేలాడదీసి చంపారు. ఘజియాబాద్ పరిధిలోని ఎలైచిపూర్ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. నిర్మాణం జరుగుతున్న చోట ముగ్గురు వ్యక్తులు ఒక నల్లని కుక్కను దారుణంగా హతమార్చారు. దాని మెడకు ఉన్న చైన్తోనే గోడకు వేలాడదీశారు. అనంతరం కుక్క మెడకు మరో చైన్ బిగించి ఇరువైపులా లాగి ఊపిరాడకుండా చేసి చంపారు. దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో జరిగిన ఈ దారుణ సంఘటన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాగా దీనిపై స్పందించిన పోలీసులు.. ఈ వీడియో మూడు నెలల కిందటిదని తెలిపారు. ముగ్గురు వ్యక్తులను పోలీస్ స్టేషన్కు రప్పించి ప్రశ్నించినట్లు వెల్లడించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మిత్రుడి పెళ్లికి హాజరైన అమెరికా ఫ్రెండ్స్.. వాళ్ల వేషధారణ చూసి.. !!
Viral: మహిళ కడుపులో 4 అడుగుల పాము !! డాక్టర్లు షాక్ !!
తెలుగు సినిమాలపై కోలీవుడ్ వార్.. విజయ్ కారణంగానే ఈ పరిస్థితి
Mahesh Babu: తండ్రి పోయిన బాధలోనూ.. చిన్నారికి ప్రాణం పోశాడు..