Viral Video: కదులుతున్న రైలుకి, ప్లాట్‌ఫాం మధ్యలో ప్రయాణికుడు…చివరికి..?

Updated on: Jul 13, 2023 | 7:09 PM

ఒంగోలు రైల్వే ప్లాట్‌ఫాం… వచ్చేపోయే రైళ్ళతో, ప్రయాణీకులతో రద్దీగా ఉంది… ఆ సమయంలో తిరుపతి నుంచి ఆదిలాబాద్‌ వెళ్ళే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ రైలు ఒకటో నెంబర్‌ ప్లాట్‌ఫాం నుంచి బయలుదేరింది. కదులుతున్న రైలు ఎక్కే క్రమంలో ఓ ప్రయాణికుడు కాలు జారి, రైలుకు, ప్లాట్‌ఫాంకి మధ్యలో పడిపోయాడు.

ఒంగోలు రైల్వే ప్లాట్‌ఫాం… వచ్చేపోయే రైళ్ళతో, ప్రయాణీకులతో రద్దీగా ఉంది… ఆ సమయంలో తిరుపతి నుంచి ఆదిలాబాద్‌ వెళ్ళే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ రైలు ఒకటో నెంబర్‌ ప్లాట్‌ఫాం నుంచి బయలుదేరింది. కదులుతున్న రైలు ఎక్కే క్రమంలో ఓ ప్రయాణికుడు కాలు జారి, రైలుకు, ప్లాట్‌ఫాంకి మధ్యలో పడిపోయాడు. ఆ సమయంలో రైలుబోగీ తలుపును బలంగా పట్టుకున్నాడు. దీంతో ఆ యువకుడ్ని రైలు ఈడ్చుకు వెళ్లిపోయింది. ఈ దృశ్యం చూసిన ప్రయాణీకులు ఒక్కసారిగా హాహాకారాలు చేశారు… అంతా భయంగా అరుస్తున్నారే కానీ సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
అదే సమయంలో ప్లాట్‌ఫాంపై ఫోను మాట్లాడుకుంటూ వెళుతున్న రైల్వే ప్రోటెక్షన్‌ ఫోర్స్‌ ఏఎస్‌ఐ శ్రీనివాసరావు ఆ యువకుడ్ని గమనించి వెంటనే ఒక్కదుటున రైలు దగ్గరకు పరుగు తీశాడు. రైలుకు, ప్లాట్‌ఫాంకు మధ్య ఈడ్డుకుంటూ వెళుతున్న ప్రయాణీకుడిని పట్టుకుని పైకి లాగేశాడు. అప్పటికే ప్లాట్‌ఫాంపై ఉన్న ప్రయాణీకులు కేకలు వేయడతో ఎవరో రైల్లో చైన్‌ లాగారు. రైలు ఆగిపోయింది అప్పటికే ప్రయాణీకుడిని చావు బారినుంచి కాపాడాడు ఆర్‌పియఫ్‌ ఏఏస్‌ఐ శ్రీనివాసరావు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...

Loading...
Unable to load recommendations.
Follow Us