ఇది కదా ప్రేమంటే.. పెంపుడు శునకానికి విగ్రహం !!

|

Jan 05, 2023 | 8:39 AM

మానవ సంబంధాలు మంట కలుస్తున్నా నేటి తరుణంలో.. 9 సంవత్సరాలు పాటు సొంత బిడ్డలా ఎంతో అప్యాయంగా పెంచిన శునకం చనిపోతే గుర్తుగా విగ్రహం ఏర్పాటు చేశారు.

మానవ సంబంధాలు మంట కలుస్తున్నా నేటి తరుణంలో.. 9 సంవత్సరాలు పాటు సొంత బిడ్డలా ఎంతో అప్యాయంగా పెంచిన శునకం చనిపోతే గుర్తుగా విగ్రహం ఏర్పాటు చేశారు. వరంగల్‌లోని బ్యాంక్ కాలనీకి చెందిన భాగ్యలక్ష్మి- దనుంజయ్ దంపతులు రాట్ వీలర్ అనే జెస్సి పెట్ డాగ్‌ను ఆప్యాయంగా పెంచుకున్నారు. రోజురోజుకు ఆ దంపతులపై మాగజీవం చూపించే విశ్వాసంతో మరింత ప్రేమ పెంచుకున్నారు. దంపతులిద్దరూ ఏదైనా పనిమీదా బయటకు వెళ్లితే వచ్చే వరకు కనీసం అన్న పానీయాలు ముట్టుకునేది కాదు. సొంత కొడుకులాగ పెరిగిన కుక్క అకస్మాత్తుగా అనారోగ్యంతో చనిపోవటంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. మనషులకు జరిపినట్లుగానే శునకానికి కర్మకాండలు నిర్వహించారు. అ మూగ జీవం ఉంచిన జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. జెస్సి జ్ఞాపకార్థం గీసుకొండ మండలం మచ్చాపూర్‌లోని వారి వ్యవసాయ క్షేత్రం వద్ద కుక్క విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ మూగజీవాల పట్ల తనకున్న విశ్వాసాన్ని చాటుకున్నారు. సొంత కుటుంబ సభ్యుల చనిపోతే పట్టించుకోని ఈ రోజుల్లో స్వంత బిడ్డలా సాకిన భాగ్యలక్ష్మి- దనుంజయ్ దంపతులు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వెరీ స్మాట్ గుడ్డు !! చాక్లెట్ సైజ్‌లో వింత కోడిగుడ్డు హల్‌చల్‌ !!

Follow us on