ఒక్కోసారి మనిషి ఆకతాయి తనంతో చేసే పనులు వారి జీవితాన్నే అంతం చేస్తాయి. అందుకు ఉదాహరణే ఈ ఘటన. తమిళనాడులో ఓ 11 ఏళ్ల కుర్రాడు ఆత్మహత్య చేసుకోవడం ఎలాగో నటించి తన సోదరులకు చూపించాలనుకున్నాడు. అదే అతనిపాలిట శాపంగా మారింది. ఆయువు తీసింది. ఈ విషాద సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. చెన్నై పుళల్ సమీపంలో పుళల్ సమీపంలోని బుద్దాగరం గ్రామం కామరజర్ నగర్కు చెందిన శ్రీనివాసన్ రెండో కుమారుడు కార్తీక్. అదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో సెప్టెంబర్ 24 రాత్రి తన ఇద్దరు సోదరులతో కలిసి నిద్రకు ఉపక్రమించారు. ఈ క్రమంలో వారికి ఎందుకు ఆ ఆలోచన వచ్చిందో తెలీదు కానీ తన సోదరులకు ఆత్మహత్య చేసుకోవడం ఎలాగో చూపిస్తానంటూ గదిలో పరుపు మీద కుర్చీ వేసుకుని, కుర్చీపైకి ఎక్కి నిలబడి ఫ్యాన్ కొక్కానికి నైలాన్ తాడు కట్టాడు, మరో కొనను కార్తీక్ మెడకు చుట్టుకున్నాడు. ఈ క్రమంలో కార్తీక్ నిలబడిన కుర్చీ తూలి కింద పడిపోయింది. దాంతో కార్తీక్ మెడకు నైలాన్ తాడు బిగుసుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పుళల్ పోలీసులు కార్తీక్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్లోనే..
Pizza: మార్కెట్లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..