వెంకన్న ఆలయంలో భారీ చోరీ..తాళాలు పగలగొట్టి వీడియో
శ్రీకాకుళం జిల్లా పలాసలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఆదివారం రాత్రి దొంగలు సీసీ కెమెరాలను తొలగించి, తాళాలు పగలగొట్టి గర్భగుడిలోని రూ.9 లక్షల బంగారు ఆభరణాలతో పాటు హుండీల నుంచి నగదును అపహరించారు. మొత్తం రూ.50 లక్షలకు పైబడి సొత్తు చోరీకి గురైనట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఇటీవల పోలీస్ పికెటింగ్ ఎత్తేసిన కొద్ది రోజులకే ఈ ఘటన జరిగింది.
శ్రీకాకుళం జిల్లా పలాసలోని “చిన్న తిరుపతి”గా పేరుగాంచిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఆదివారం రాత్రి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన దొంగలు సీసీ కెమెరాల వైర్లు తొలగించి, ఆలయం తాళాలు పగలగొట్టి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. గర్భాలయంలోని వెంకన్న మూల విరాట్కు అలంకరించిన సుమారు తొమ్మిది లక్షల రూపాయల విలువ చేసే బంగారు నామాలు, వెండి కిరీటం, కవచం, పాదాలు, చేతులు, కళ్లతో పాటు, రెండు హుండీలలో ఉన్న నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. మొత్తం మీద సుమారు యాభై లక్షల రూపాయలకు పైబడి నగదు, సొత్తు చోరీకి గురైనట్లు ఆలయ నిర్వాహకులు హరి ముకుంద పండా వెల్లడించారు.
మరిన్ని వీడియోల కోసం :
నిద్రలేని రాత్రులు గడిపానన్న విజయ్… మెగాస్టార్కి ఊరట!
సందీప్ని గుర్తుచేసిన గీతూ…అంతకు మించి అంటున్న ఆడియన్స్
పండగపూట భగ్గుమంటున్న చికెన్, మటన్ ధరలు
ఒక్కపాము కాటేస్తే.. మూడు పాములతో ఆస్పత్రికి..
Loading...
Unable to load recommendations.
Follow Us
