25 మంది పెళ్లి కొడుకులు.. ఒక్కతే పెళ్లి కూతురు
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్య ఘట్టం. అయితే ఇటీవలి కాలంలో పెళ్లికాని ప్రసాద్లు ఎక్కువవుతున్నారు. ఇలాంటి వారినే టార్గెట్ చేసిన ఓ యువతి నిత్య పెళ్లికూతురు అవతారమెత్తింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 25 మందిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత నగలు, డబ్బు, విలువైన వస్తువులతో ఉడాయిస్తున్న ఈ కిలేడిని తాజాగా రాజస్థాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్లితే.. ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్కు చెందిన అనురాధ పాశ్వాన్ గతంలో ఓ ఆసుపత్రిలో పనిచేసేది. భర్తతో గొడవల కారణంగా విడాకులు తీసుకుని మధ్యప్రదేశ్లోని భోపాల్కు మకాం మార్చింది. అక్కడ ఓ పెళ్లిళ్ల రాకెట్తో చేతులు కలిపి వయసు పెరుగుతూ పెళ్లిళ్లు ఆలస్యం అయ్యే యువకులను టార్గెట్గా చేసుకుంది. వారితో పెళ్లి కుదుర్చుకుని చట్టబద్ధంగానే పెళ్లిళ్లు చేసుకునేది. ఆ తర్వాత అనురాధ కొద్దిరోజులు అత్తారింట్లో ఉండి, వీలు చిక్కగానే బంగారం, క్యాష్, విలువైన వస్తువులతో ఉడాయించేది. అనంతరం వేరే ప్రాంతానికి మకాం మార్చి కొత్త పేరు, కొత్త గుర్తింపు కార్డులతో 7 నెలల్లోనే ఏకంగా 25 మందిని మోసం చేసింది. అనురాధ చేతిలో మోసపోయిన సవాయ్ మాధోపూర్కు చెందిన విష్ణు శర్మ పోలీసులను ఆశ్రయించటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు పెళ్లిళ్లు కుదుర్చే ఏజెంట్లకు రూ. 2 లక్షలు చెల్లించి అనురాధతో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నానని, ఏప్రిల్ 20న ఆమెతో పెళ్లయిందని, మే 2న ఆమె నగలతో పారిపోయిందని శర్మ పోలీసులకు తెలిపాడు. ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఒక కానిస్టేబుల్ను పెళ్లి కొడుకుగా నమ్మించి, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పునర్వికకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా పునర్జన్మ
గురుకులంలో క్షుద్రపూజలు.. రోడ్డెక్కిన విద్యార్థినులు..
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తెల్లారే సరికి పోలీస్ స్టేషన్ లో
ఏజెన్సీలో చీకటి వైద్యం.. సెల్ఫోన్ వెలుగుల్లో ప్రజల ప్రాణాలు
ముస్లిం సోదరుల కోసం హిందూ కుటుంబం ఉదారత
దారుణం.. 2 నెలల పసికందును పొయ్యిలో పడేసి..
కత్తితో కారు దిగిన మహిళ.. కారు పైకి కోడిగుడ్లు విసిరిన దుండగులు

