బిర్యానీ కోసం రెస్టారెంట్కు వెళ్లిన ఫ్రెండ్స్.. బిర్యానీ తింటుండగా..
సాధారణంగా చికెన్ బిర్యానీ వండాలంటే చికెన్తో పాటు లవంగాలు, దాల్చిన చెక్క వంటి సుగంధ ద్రవ్యాలతో పాటు కొత్తి మీర, పుదీనా, నెయ్యి వేసి చేస్తుంటారు. ఇవి అన్ని పెనంలో పడిన తర్వాత చికెన్ బిర్యానీకి వచ్చే టేస్టే అదరహో అనిపిస్తుంది. కానీ అవేమీ కాకుండా ఈ మధ్య జెర్రిలు, బల్లులు, బొద్దింకలు చికెన్ బిర్యానీలో దర్శనమిస్తున్నాయి. ఇలాంటివి చాలా చోట్లనే జరుగుతున్నాయి.
దీంతో బయట బిర్యానీ తినాలంటేనే జనం భయపడుతున్నారు. యాదాద్రి భువనగరి జిల్లా బీబీ నగర్ మండలం మక్త అనంతారం గ్రామానికి చెందిన బింగి ఐలయ్య అతడి స్నేహితులతో కలిసి ఆదర్శ్ బార్ అండ్ రెస్టారెంట్లో బిర్యానీ తిందామని వెళ్లారు. అక్కడ ఫ్రెండ్స్ అంతా కలిసి చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pushpa 2: రప్ప.. రప్ప.. ఆగని పుష్ప 2 రికార్డుల దండయాత్ర
ఆహా.. ఈ ఉద్యోగుల లక్కే.. లక్కు
Loading...
Unable to load recommendations.
Follow Us