ఇలాంటి రిస్క్‌ అవసరమేనా ?? బైక్ రైడర్ పై నెటిజన్లు ఫైర్ !!

|

Sep 05, 2022 | 8:30 PM

ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బైక్‌పై ఒకరు లేదా ఇద్దరు ప్రయాణిస్తారు. కొన్ని సందర్భాల్లో ముగ్గురు కుడా జర్నీ చేస్తారు. ట్రాఫిక్ రూల్స్ ప్రకారం బైక్‌పై ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రయాణించకూడదు.

ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బైక్‌పై ఒకరు లేదా ఇద్దరు ప్రయాణిస్తారు. కొన్ని సందర్భాల్లో ముగ్గురు కుడా జర్నీ చేస్తారు. ట్రాఫిక్ రూల్స్ ప్రకారం బైక్‌పై ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రయాణించకూడదు. అంతే కాకుండా బైక్ నడిపే వ్యక్తి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. అయితే కారులో కూడా పట్టలేనంత మంది బైక్ పై ఎక్కడం మీరు ఎప్పుడైనా చూశారా.. లేకపోతే ఈ వీడియో చూసేయండి. వైరల్ అవుతున్న ఈ క్లిప్ లో వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది. బైక్ నడిపే వ్యక్తితో పాటు ఇద్దరు మహిళలు, నలుగురు చిన్నారులతో కలిసి వీరి సంఖ్య ఏడుగురు. బైక్ నడిపే వ్యక్తి పెట్రోల్ ట్యాంక్ పై కూర్చు్న్నాడు. తర్వాత ఓ మహిళ ఆమె తర్వాత మరో మహిళ కూర్చున్నారు. పిల్లలను వారు తమ ఒళ్లో కూర్చోబెట్టుకున్నారు. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి సుప్రియాసాహు ట్విట్టర్‌లో షేర్ చేశారు. వీడియోకు ఇప్పటివరకు 31 లక్షల వ్యూస్ వచ్చాయి. కామెంట్ చేస్తూ నెటిజన్లు రియాక్షన్స్ ఇస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమ్మాయిని చూసి వరుడు పరుగో పరుగు.. ఎందుకలా ??

Follow us on