Kashmir Terror: అందర్నీ చంపేయాలనే కసి వారిలో కనిపించింది.. కశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పులు.
జూన్ 9వ తేదీన రియాసీ జిల్లాలో శివఖోరి ఆలయం నుంచి కట్రాలోని మాతా వైష్ణోదేవి మందిరానికి వెళ్తున్న ప్రయాణికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా.. దాడి నుంచి తప్పించే క్రమంలో వాహనం లోయలో పడింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోగా, 41 మంది గాయపడ్డారు. క్షతగాత్రులంతా జమ్మూలో చికిత్స తీసుకున్న అనంతరం స్వస్థలాలకు వెళ్లిపోయారు.
జూన్ 9వ తేదీన రియాసీ జిల్లాలో శివఖోరి ఆలయం నుంచి కట్రాలోని మాతా వైష్ణోదేవి మందిరానికి వెళ్తున్న ప్రయాణికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా.. దాడి నుంచి తప్పించే క్రమంలో వాహనం లోయలో పడింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోగా, 41 మంది గాయపడ్డారు. క్షతగాత్రులంతా జమ్మూలో చికిత్స తీసుకున్న అనంతరం స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఉత్తర్ప్రదేశ్కు చెందిన నీలం ఆరోజు జరిగిన సంఘటనను శుక్రవారం వివరించారు. కాల్పుల సమయంలో తాను కూడా బస్సులోనే ఉన్నాననీ, లోయలో పడిన తర్వాత కూడా ఉగ్రవాదులు పైనుంచే తూటాల వర్షం కురిపించారన్నారు. వారి తీరు చూస్తుంటే.. అందర్నీ చంపేయాలనే కసి ఉన్నట్లు కనిపించిందని ఆమె పేర్కొన్నారు.
జమ్మూకశ్మీర్లో ఇటీవల వరుసగా జరుగుతున్న ఉగ్రదాడుల నేపథ్యంలో శుక్రవారం అక్కడి శాంతి భద్రతల పరిస్థితిని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్షించారు. గత నాలుగు రోజుల్లో రియాసీ, కఠువా, డోడా జిల్లాల్లోని నాలుగు ప్రదేశాల్లో ఉగ్రవాదులు దాడులు చేసి తొమ్మిది మంది యాత్రికులను, ఓ సీఆర్పీఎఫ్ జవాన్ను హత్య చేసారు. ప్రస్తుతం కశ్మీర్లో నెలకొన్న పరిస్థితిపై ఉన్నతాధికారులు.. షాకు వివరించారు. దీంతో ఆదివారం కశ్మీర్పై ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అధికారులకు షా సూచించారు. ఈ భేటీలో జాతీయ భద్రతాసలహాదారు అజీత్ దోభాల్, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు పాల్గొంటారని అధికారులు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

