రూ.12తో పాపం కడిగేసుకోవచ్చు !! సర్టిఫికెట్టూ తీసుకోవచ్చు !!

ఏ ఆలయం విశిష్టత దానికే ఉంటుంది. ఓ ఆలయంలో పూజలు చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందని, మరో ఆలయంలో దైవాన్ని దర్శించుకుంటే ధన లబ్ధి చేకూరుతుందని, ఇంకో ప్రాంతంలోని ఆలయానికి వెళ్తే శని తొలగిపోతుందని, వేరొక ప్రాంతంలోని ఆలయంలో దైవ దర్శనం చేసుకుంటే చేసిన పాపాలు పోతాయని ఇలా రకరకాలుగా భక్తులు విశ్వసిస్తుంటారు. చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి పరిహారాల కోసం కొందరు భారీ ఎత్తున ఖర్చు కూడా చేస్తుంటారు.

రూ.12తో పాపం కడిగేసుకోవచ్చు !! సర్టిఫికెట్టూ తీసుకోవచ్చు !!

|

Updated on: Dec 19, 2023 | 9:57 AM

ఏ ఆలయం విశిష్టత దానికే ఉంటుంది. ఓ ఆలయంలో పూజలు చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందని, మరో ఆలయంలో దైవాన్ని దర్శించుకుంటే ధన లబ్ధి చేకూరుతుందని, ఇంకో ప్రాంతంలోని ఆలయానికి వెళ్తే శని తొలగిపోతుందని, వేరొక ప్రాంతంలోని ఆలయంలో దైవ దర్శనం చేసుకుంటే చేసిన పాపాలు పోతాయని ఇలా రకరకాలుగా భక్తులు విశ్వసిస్తుంటారు. చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి పరిహారాల కోసం కొందరు భారీ ఎత్తున ఖర్చు కూడా చేస్తుంటారు. కానీ చేసిన పాపం పోయినట్టుగా సర్టిఫికెట్‌ సైతం ఇచ్చే ఆలయం గురించి ఎప్పుడైనా విన్నారా..? రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌లో ఒక పురాతన ఆలయం గత కొన్ని శతాబ్దాలుగా తీర్థ యాత్రలకు ప్రసిద్ధిగాంచింది. ఆ ఆలయాన్ని గిరిజనుల హరిద్వార్‌ అని కూడా పిలుస్తారు. ఎన్నో ఏళ్లుగా అక్కడికి వచ్చే భక్తులకు చేసిన పాపం పోయినట్లుగా ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే ఆచారం ఉంది. దీన్నే గౌతమేశ్వర్ మహాదేవ్ పాపమోచన తీర్థంగా కూడా పిలుస్తారు. ఈ ఆలయం పక్కనే ‘మందాకిని పాప విమోచిని గంగా కుండ్‌’ అనే రిజర్వాయర్‌ ఉంది. ఆ జలాశయం నీటితో స్నానం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ గుడిలో కేవలం రూ.12 చెల్లించి పుణ్య స్నానం చేయవచ్చు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

120 అడుగులు కటౌట్‌… మొదలైన మాస్ మేనియా

భాగ్యనగరంలో దిమ్మతిరిగే రెస్పాన్స్‌.. దటీజ్‌ షారుఖ్ ఖాన్..

Bigg Boss 7: బిగ్ బాస్ రచ్చరచ్చసజ్జనార్ సీరియస్

రెండో పెళ్లి చేసుకుంటారా ?? సామ్ దిమ్మతిరిగే రియాక్షన్

రైతుబిడ్డ Vs అమర్‌దీప్.. ఫ్యాన్స్‌ రచ్చపై పోలీసులు సీరియస్

Follow us