AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రాణం పోతున్నా.. ప్రయాణికులను కాపాడి వీడియో

ప్రాణం పోతున్నా.. ప్రయాణికులను కాపాడి వీడియో

Samatha J
|

Updated on: Aug 31, 2025 | 4:10 PM

Share

ఓ డ్రైవర్ సమయస్ఫూర్తి, అంకితభావం, పదుల సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలను కాపాడింది. బస్సు నడుపుతూ ఉండగా డ్రైవర్ కు గుండెపోటు రావడంతో పరిస్థితి చేయిదాటుపోయిందని గ్రహించి ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకూడదని భావించి ఆ డ్రైవర్ స్టీరింగ్ ను తోటి డ్రైవర్ కు అప్పగించి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఈ ఘటన రాజస్థాన్ లో జరిగింది. సుదూర ప్రాంతాలకు ప్రయాణించే బస్సుల్లో ఇద్దరు డ్రైవర్ల గొప్పతనాన్ని మరోసారి గుర్తు చేస్తుంది.

రాజస్థాన్ కు చెందిన సతీష్ అనే డ్రైవర్ గురువారం ఉదయం జోద్ పూర్ నుంచి ఇండోర్ కు వెళ్తున్న బస్సును నడుపుతున్నారు. కె.ఎల్.వారాజ్ నగర్ కు దగ్గరగా రాగానే అతనికి ఏదో అసౌకర్యంగా అనిపించింది. నెమ్మదిగా ఛాతిలో నొప్పి మొదలయింది. తగ్గిపోతుందిలే అనుకొని సతీష్ బస్సును డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్నాడు. నెమ్మదిగా నొప్పి ఎక్కువ కావడంతో పరిస్థితి చేయిదాటుపోతుందని గ్రహించి వెంటనే అలర్ట్ అయ్యాడు. తోటి డ్రైవర్ ను పిలిచి బస్సును నడపాల్సిందిగా చెప్పి స్టీరింగ్ అతనికే అప్పగించి పక్కకు వచ్చాడు. మరో క్షణం కుప్పకూలిపోయాడు. ఈ హఠాత్ పరిణామానికి షాక్ అయిన ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఓ మహిళ భయంతో కేకలు వేయడంతో మిగతా ప్రయాణికులు వచ్చి సహాయాలు చేసి అతన్ని లేపి నిలబెట్టే ప్రయత్నం చేశారు. బస్సును నడుపుతున్న మరో డ్రైవర్ గోమతి చౌరస్తాలో ఆపి మందుల కోసం ప్రయత్నించాడు. కానీ అప్పటికే మందుల షాప్స్ మూసివేయడంతో వెంటనే బస్సును ముందుకు పోనించాడు. తోటి డ్రైవర్ ను బ్రతికించుకునేందుకు ఎంతో ఆత్రంగా ముందుకు పోనించాడు. సతీష్ పరిస్థితి మరింత విషమించింది. కంగారుపడిన డ్రైవర్ బస్సును వేగంగా పోనిస్తూ నేరుగా దేశూరిలోని ఆసుపత్రికి తరలించారు. కానీ ఆయన ప్రయత్నం ఫలించలేదు. సతీష్ ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు.

మరిన్ని వీడియోల కోసం :

ఏఐతో ఓ యూజర్‌ సంభాషణ.. షాక్‌తిన్న చాట్‌జీపీటీ.. ఏం జరిగిందంటే..

వింత ఘటన.. నీలం రంగులో గుడ్డు పెట్టిన నాటు కోడి వీడియో

17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. ‘తల్లికి వందనం’ అమలు చేయాలంటూ డిమాండ్ వీడియో