మార్చురీకి తరలించిన వ్యక్తిలో కదలికలు !! ఏం జరిగిందంటే ??
చనిపోయాడని నిర్ధారించి ఓ పోలీస్ అధికారిని పోస్ట్మార్టంకు తరలించారు. ఆ సమయంలో అనూహ్యంగా చనిపోయిన వ్యక్తిలో కదలికలు గుర్తంచాడు అక్కడున్న మరో పోలీసు అధికారి. వెంటనే కుటుంబసభ్యులకు చెప్పడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఈ విచిత్ర సంఘటన పంజాబ్లో చోటుచేసుకుంది. పంజాబ్ రాష్ట్రంలో లుథియానాకు చెందిన మన్ప్రీత్ అనే పోలీస్ అధికారికి సెప్టెంబర్ 15వ తేదీన ఓ విష పురుగు కుట్టింది.
చనిపోయాడని నిర్ధారించి ఓ పోలీస్ అధికారిని పోస్ట్మార్టంకు తరలించారు. ఆ సమయంలో అనూహ్యంగా చనిపోయిన వ్యక్తిలో కదలికలు గుర్తంచాడు అక్కడున్న మరో పోలీసు అధికారి. వెంటనే కుటుంబసభ్యులకు చెప్పడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఈ విచిత్ర సంఘటన పంజాబ్లో చోటుచేసుకుంది. పంజాబ్ రాష్ట్రంలో లుథియానాకు చెందిన మన్ప్రీత్ అనే పోలీస్ అధికారికి సెప్టెంబర్ 15వ తేదీన ఓ విష పురుగు కుట్టింది. దీంతో వెంటనే లుథియానాలో ఉన్న ఓ ఆసుపత్రిలో చేర్పించారు. పురుగు కుట్టి చాలా సేపు గడడంతో విషయం ఒళ్లంతా పాకింది. శరీరమంతా ఇన్ఫెక్షన్ సోకడంతో మన్ప్రీత్ ఆరోగ్యం ప్రమాదకరంగా మారింది. దీంతో వెంటనే వైద్యులు మన్ప్రీత్ను వెంటిలేటర్పై ఉంచి చికిత్స ప్రారంభించారు. వైద్యుల కృషి ఫలించలేదు. సెప్టెంబర్ 18వ తేదీ అర్థరాత్రి మన్ప్రీత్ సింగ్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం కుటుంబ సభ్యలకు ఈ విషయాన్ని తెలియజేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చైనాలో సుడిగాలి బీభత్సం !! నెట్టింట వైరల్ అవుతున్న దృశ్యాలు
మమ్మల్నే పట్టిస్తారా అని తెల్లారేసరికి మాయం చేశారు.. నిందితులకోసం గాలిస్తున్న పోలీసులు
