టోక్యో ఒలింపిక్స్లో అద్భుత ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు ఆగస్టు 16న ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక అల్పాహార విందు ఇవ్వడం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రతి క్రీడాకారులను ప్రధాని మోడీ విడివిడిగా పలకరించారు. ఒలింపిక్స్ పర్యటన మధుర అనుభవాల గురించి క్రీడాకారులను అడిగి తెలుసుకున్నారు. ఒలింపిక్స్కు బయలుదేరి వెళ్లే ముందు పీవీ సింధుకు ఇచ్చిన మాట మేరకు ఆమెతో కలిసి ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేశారు. అలాగే ఒలింపిక్స్తో స్వర్ణ పతకం సాధించిన జావెలిన్ త్రోవర్ నీరజ్ చోప్రాతో చూర్మా ఎంజాయ్ చేశారు. ఒలింపిక్స్ పతకం గెలిచిన ప్రతి ఒక్కరినీ ప్రశంసించారు. తృటిలో పతకం చేజారిన క్రీడాకారులను ప్రోత్సహించారు. కాగా ఒలింపిక్స్ క్రీడాకారులతో ముచ్చటిస్తున్న వీడియోను ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఉదయం తన ట్విట్టర్ ఖాతాల్లో షేర్ చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి : తూటతో ప్రాణం.. పాటతో బంధం..! ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా’ పాపులర్ అయినా సాంగ్..:Bullettu Bandi song video.
ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ ఎంతో తెలుసా..? టీ20 షెడ్యూల్ మరియు ఐపీఎల్ పై క్లారిటీ..:IPL video.
తాలిబన్ డార్క్ సీక్రెట్స్.. ఇరవై ఏళ్ల పాటు సాగిన ప్రజాపాలన అంతం..:Afghanistan Crisis Live video.