వ్యక్తి చనిపోయాడని కన్ఫామ్ చేసిన డాక్టర్లు !! అంత్యక్రియలకు ముందు స్నానం చేయిస్తుండగా షాక్ !!

|

Apr 19, 2022 | 9:40 PM

ఉత్తరాఖండ్​లో ఓ షాకింగ్ సంఘటన వెలుగుచూసింది. ప్రైవేట్​ ఆసుపత్రి నిర్లక్ష్య ధోరణి బయటపడింది. రోగి బతికుండగానే చనిపోయాడని డాక్టర్లు కన్ఫామ్ చేశారు.


ఉత్తరాఖండ్​లో ఓ షాకింగ్ సంఘటన వెలుగుచూసింది. ప్రైవేట్​ ఆసుపత్రి నిర్లక్ష్య ధోరణి బయటపడింది. రోగి బతికుండగానే చనిపోయాడని డాక్టర్లు కన్ఫామ్ చేశారు. కరణ్​పూర్​కు చెందిన అజాబ్​ సింగ్ అనే రోగికి బీపీ డౌన్ అవ్వడం వల్ల లక్సర్​లోని హిమాలయన్​ హాస్పిటల్‌లో చేర్పించారు కుటుంబ సభ్యులు. వెంటనే అడ్మిట్ చేసుకున్న డాక్టర్లు.. ఎమర్జెన్సీ వార్డులో ఉంచి.. 4 రోజుల పాటు వెంటిలేటర్​ పెట్టి చికిత్స అందించారు. శుక్రవారం.. అజాబ్ సింగ్ మరణించారని చెప్పి.. వెంటిలేటర్​ను తీసేశారు. ద బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చామని.. అయినా రోగి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదని కుటుంబసభ్యులకు డాక్టర్లు తెలిపారు. నాలుగు రోజులు ట్రీట్మెంట్ ఖర్చులకుగానూ రోగి కుటుంబం నుంచి 1,70,000 రూపాయలు వసూలు చేసింది ఆసుపత్రి యజమాన్యం.

Also Watch:

మరీ ఇంత దారుణమా… ప్రభాస్‌కు బాలీవుడ్‌లో ఘోర అవమానం

Follow us on