Train journy: ఇలాంటి ట్రైన్ జర్నీ ఎప్పుడైనా చేసరా.. పోనీ చూశారా..? వైరల్ అవుతున్న స్టన్నింగ్ వీడియో..
రైలు ప్రయాణం ఎవరికైనా అందమైనదే.. అందరూ ట్రైన్ జర్నీని ఆస్వాదిస్తారు. దేశంలో ఎక్కడికైనా ప్రయాణించడానికి ఇదే ఉత్తమ వాహనం. అయితే ప్రజలు సాధారణంగా రైలు లోపల కూర్చొని
రైలు ప్రయాణం ఎవరికైనా అందమైనదే.. అందరూ ట్రైన్ జర్నీని ఆస్వాదిస్తారు. దేశంలో ఎక్కడికైనా ప్రయాణించడానికి ఇదే ఉత్తమ వాహనం. అయితే ప్రజలు సాధారణంగా రైలు లోపల కూర్చొని ప్రయాణం చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం వందలాదిమంది ట్రైన్ పైన కూర్చుని ప్రయాణిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఈ వీడియో చూసి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.వైరల్ అవుతున్న వీడియోలో రైలు అందమైన ప్రకృతి మధ్య అడవుల గుండా వెళుతుంది. తరువాత ఎత్తైన వంతెన మీదుగా వెళుతుంది. అయితే చాలామంది ప్రయాణికులు రైలు పైన నిలబడి, కూర్చుని హాయిగా ప్రయాణిస్తున్నారు. ఆ రైలు బ్రిడ్జ్పై వెళ్తున్నప్పుడు కింద పడిపోతామేమో అన్న భయం కూడా వారిలో లేదు. పార్కులో నిలబడినట్లే రైలు పైన నిలబడి ఉన్నారు. ఈ ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది.ఈ రైలు ఆరావళి కొండల గుండా వెళుతున్నప్పుడు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ షాకింగ్ వీడియో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయబడింది. ఈ వీడియోను లక్షలమంది వీక్షిస్తూ లైక్ చేసారు. తమదైనశైలిలో కామెంట్లు చేసారు. ఇది ప్రమాదకరమని కొందరు, ‘లైక్లు, ఫాలోవర్ల కోసం ఇలా ప్రాణాలను పణంగా పెట్టడం అస్సలు సరికాదు’ అని మరికొందరు అంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్లోనే..
Pizza: మార్కెట్లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..