కోతి చేసిన పనికి ఇద్దరు ప్రాణాలు బలి !! అసలు ఏం జరిగిదంటే ??

|

Sep 17, 2024 | 5:33 PM

ఇటీవల కోతులు వనాలను వదిలి గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి. ఇళ్లలో చొరబడి నానా హంగామా చేస్తున్నాయి. ఏది దొరికితే అది ఎత్తుకొని పోవడమే కాకుండా ప్రజలపై దాడులకు పాల్పడుతున్న ఘటనలు మనం చూశాం. తాజాగా ఓ కోతి చేసిన పనికి రెండు నిండు ప్రాణాలు బలైపోయాయి. కోతి ఎత్తుకొచ్చిన ఓ విషపు ప్యాకెట్‌ను టీపొడి అనుకొని టీచేసుకొని తాగిన వృద్ధదంపతులు ప్రాణాలు కోల్పోయారు.

ఇటీవల కోతులు వనాలను వదిలి గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి. ఇళ్లలో చొరబడి నానా హంగామా చేస్తున్నాయి. ఏది దొరికితే అది ఎత్తుకొని పోవడమే కాకుండా ప్రజలపై దాడులకు పాల్పడుతున్న ఘటనలు మనం చూశాం. తాజాగా ఓ కోతి చేసిన పనికి రెండు నిండు ప్రాణాలు బలైపోయాయి. కోతి ఎత్తుకొచ్చిన ఓ విషపు ప్యాకెట్‌ను టీపొడి అనుకొని టీచేసుకొని తాగిన వృద్ధదంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన రాజమహేంద్రవరం రాజానగరంలో చోటుచేసుకుంది. కోతి చేష్టలు సంతోషాన్నే కాదు, విషాదాన్ని కూడా నింపుతాయి అనడానికి ఈ ఘటనే సాక్ష్యం. రాజమహేంద్రవరం రాజానగరం మండలంలోని పల్లకడియం గ్రామానికి చెందిన వెలుచూరి గోవిందు , అప్పాయమ్మ దంపతుల పిల్లలు వేరే చోట నివసిస్తుండటంతో ఈ వృద్ధ దంపతులు ఇద్దరే ఇంట్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం గోవిందు, అప్పాయమ్మల ఇంటి నుంచి ఒక టీ పొడి ప్యాకెట్‌ను కోతి ఎత్తుకుపోయింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Squid Game: స్క్విడ్‌ గేమ్‌.. హిందీ చిత్రం “లక్‌”కు కాపీనా ??

ట్రాన్స్‌జెండర్స్‌ సేవలతో ట్రాఫిక్‌ కష్టాలు తీరుతాయా ??

Follow us on