వామ్మో.. బుసలు కొడుతున్న కింగ్ కోబ్రాలు వీడియో
అనకాపల్లి జిల్లాలో కొద్ది రోజులుగా భారీ గిరినాలు పాములు కలకలం సృష్టించాయి. దేవరపల్లి మండల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. అయితే ఎటకేళకు మారేపల్లి గ్రామంలో తిరుగుతున్న ఆ రెండు గిరినాలులను బంధించారు. ఒక్కొక్కటి 12 అడుగుల పొడవున్న భారీ కింగ్ కోబ్రాలను స్నేక్ కాచర్స్ అడవిలో వదిలిపెట్టారు.
రెండు మూడు రోజులుగా భారీ కింగ్ కోబ్రాలు పంట పొలాల్లో తిరుగుతూ రైతులను భయాందోళనకు గురిచేశాయి. ఓ చోట పొలం పక్కన ఉన్న పుట్టలో ప్రవేశించిన రెండు గిరినాలులను చూసిన స్థానికులు ఫారెస్ట్ ఈస్టర్న్ గార్ట్ వైల్డ్ లైఫ్ సొసైటీకి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న స్నేక్ కాచర్స్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. దాదాపు గంటన్నర పాటు శ్రమించిన రెస్క్యూ టీం ఎటకేళకు భారీ గిరినాలులను బంధించింది. అనంతరం ఫారెస్ట్ అధికారులు ఆ రెండు గిరినాలులను అడవిలో విడిచిపెట్టారు. రెండు గిరినాలుల్లో మేల్, ఫీమేల్ ఉన్నట్లు గుర్తించారు. జతకట్టే సమయం కావడంతో గిరినాలులు కనిపించడం సహజమని ఈస్టర్న్ గార్ట్ వైల్డ్ లైఫ్ సొసైటీ సభ్యులు తెలిపారు.
మరిన్ని వార్తల కోసం :