కర్మకాండకు రెడీ చేస్తుండగా.. బతికే ఉన్నానంటూ ఫోన్‌!

Updated on: Jan 14, 2026 | 12:42 PM

అమ్మ కనిపించకుండా పోయి రెండున్నర ఏళ్లు కాగా, కుటుంబం ఆమె లేదనుకుని కర్మకాండలకు సిద్ధమైంది. ఇంతలో ఖమ్మంలోని అన్నం సేవా ఆశ్రమం నుండి ఆమె బతికే ఉన్నారని ఫోన్ వచ్చింది. ప్రకాశం జిల్లాకు చెందిన వెంకటలక్ష్మిని పోలీసులు ఆశ్రమానికి చేర్చగా, చికిత్స అనంతరం కుటుంబానికి అప్పగించారు. ఈ వార్తతో విషాదంలో ఉన్న కుటుంబం ఆనందంలో మునిగిపోయింది.

అమ్మ కనిపించకుండా పోయి రెండున్నర ఏళ్లు అవుతుంది. ఆమె కోసం ఇన్నాళ్లూ ఎదురుచూసిన కుటుంబం, ఇక ఆమె లేదనుకుని కర్మకాండలు నిర్వహించేందుకు సిద్ధమయ్యింది. సరిగ్గా అదే సమయంలో, వారికి ఊహించని విధంగా ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్‌లో అందిన సమాచారం విని కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. ఈ హృదయ విదారక, ఆనందకర ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా, కంబం మండలం, ఎల్ కోట గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మానసిక సమస్యలతో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు విస్తృతంగా గాలించినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. ఆమె భర్త, భార్యపై బెంగతో మూడు రోజులకే మరణించడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

మరిన్ని వీడియోల కోసం :

నిద్రలేని రాత్రులు గడిపానన్న విజయ్‌… మెగాస్టార్‌కి ఊరట!

సందీప్‌ని గుర్తుచేసిన గీతూ…అంతకు మించి అంటున్న ఆడియన్స్

పండగపూట భగ్గుమంటున్న చికెన్‌, మటన్‌ ధరలు

ఒక్కపాము కాటేస్తే.. మూడు పాములతో ఆస్పత్రికి..