అదృశ్యమైన నటుడు.. 24 రోజుల తర్వాత ఇంటికొచ్చాడు

|

May 21, 2024 | 8:26 PM

దాదాపు 3 వారాల క్రితం ప్రముఖ టీవీ షో నటుడు గురు చరణ్ సింగ్ అదృశ్యం కలకలం రేపింది. ఏప్రిల్‌ 22న ఆయన ముంబయికి వెళ్తున్నానని చెప్పి ఢిల్లీ నుంచి ఎయిర్‌పోర్టుకు బయల్దేరారు. ఆ తర్వాత ఆయన సమాచారం తెలియరాలేదు. ఏప్రిల్‌ 24 తర్వాత సింగ్‌ ఫోన్‌ కూడా పనిచేయకపోవడంతో ఆందోళనకు గురైన నటుడి తండ్రి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆచూకి కనుగొన్నారు.

దాదాపు 3 వారాల క్రితం ప్రముఖ టీవీ షో నటుడు గురు చరణ్ సింగ్ అదృశ్యం కలకలం రేపింది. ఏప్రిల్‌ 22న ఆయన ముంబయికి వెళ్తున్నానని చెప్పి ఢిల్లీ నుంచి ఎయిర్‌పోర్టుకు బయల్దేరారు. ఆ తర్వాత ఆయన సమాచారం తెలియరాలేదు. ఏప్రిల్‌ 24 తర్వాత సింగ్‌ ఫోన్‌ కూడా పనిచేయకపోవడంతో ఆందోళనకు గురైన నటుడి తండ్రి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆచూకి కనుగొన్నారు. తిరిగి వచ్చాక ఆయన పోలీసులతో దిగిన సెల్ఫీ ప్రస్తుతం ఎక్స్‌లో వైరల్‌ అవుతుంది. ‘తారక్‌ మెహతా కా ఉల్టా చష్మా’ నటుడు గురుచరణ్‌ సింగ్‌ 24 రోజుల తర్వాత ఇల్లు చేరడంతో కుటుంబసభ్యలు ఊపిరిపీల్చకున్నారు. ఏప్రిల్‌ 22న అదృశ్యమైన ఆయన శుక్రవారం క్షేమంగా తిరిగి వచ్చారు. ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగంగా గురుచరణ్‌ కొన్ని ప్రదేశాలకు వెళ్లినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ధ్యానం కోసం హిమాలయాలకు వెళ్లడానికి ఆయన ఆసక్తి చూపినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అతని అకౌంట్లోకి రూ.9,900 కోట్లు !! వచ్చిపడ్డాయి.. ఎలా అంటే ??

Follow us on