ఇక్కడ తవ్వే కొద్ది వజ్రాలు !! 65 ఏళ్లల్లో కోటి కేరట్ల వెలికితీత

|

Jan 25, 2024 | 6:44 PM

తూర్పు సెర్బియాలో ఉన్న వజ్రాల గని భూమ్మీద అతి పెద్ద గోతుల్లో ఒకటిగా రికార్డులకెక్కింది. తొలిసారిగా ఈ ప్రాంతంలో వజ్రాల నిక్షేపాలు ఉన్నట్లు 1955లో నాటి సోవియట్‌ భూగర్భ శాస్త్రవేత్త యూరీ ఖబార్దిన్‌ గుర్తించారు. వజ్రాలను వెలికి తీసేందుకు అప్పటి సోవియట్‌ ప్రభుత్వం 1957లో ఇక్కడ మిర్నీ మైన్‌ పేరిట గనిని ప్రారంభించింది. దీని వ్యాసం 1200 మీటర్లు, లోతు 525 మీటర్లు. ఈ గని నుంచి ఏకధాటిగా 2001 వరకు వజ్రాల వెలికి తీత కొనసాగింది.

తూర్పు సెర్బియాలో ఉన్న వజ్రాల గని భూమ్మీద అతి పెద్ద గోతుల్లో ఒకటిగా రికార్డులకెక్కింది. తొలిసారిగా ఈ ప్రాంతంలో వజ్రాల నిక్షేపాలు ఉన్నట్లు 1955లో నాటి సోవియట్‌ భూగర్భ శాస్త్రవేత్త యూరీ ఖబార్దిన్‌ గుర్తించారు. వజ్రాలను వెలికి తీసేందుకు అప్పటి సోవియట్‌ ప్రభుత్వం 1957లో ఇక్కడ మిర్నీ మైన్‌ పేరిట గనిని ప్రారంభించింది. దీని వ్యాసం 1200 మీటర్లు, లోతు 525 మీటర్లు. ఈ గని నుంచి ఏకధాటిగా 2001 వరకు వజ్రాల వెలికి తీత కొనసాగింది. తర్వాత కొన్నాళ్లు ఇది మూతబడింది. ఇది రష్యన్‌ వజ్రాల కంపెనీ ‘ఎయిరోసా’ చేతుల్లోకి వెళ్లడంతో 2009 నుంచి మళ్లీ వజ్రాల వెలికితీత కొనసాగుతోంది. ఇక్కడ వజ్రాల గని ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు ఏటా సగటున కోటి కేరట్ల అంటే దాదాపు రెండువేల కిలోల వజ్రాల వెలికితీత జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. మరో నలబై ఏళ్లకు పైగా ఇక్కడి నుంచి వజ్రాలను వెలికితీసే అవకాశాలు ఉన్నాయని ఎయిరోసా కంపెనీ భావిస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇక్కడ ఎంతటి కోటీశ్వరుడైనా అడుక్కోవాల్సిందే

Hanuman: UP సీఎంను కదిలించిన ‘హనుమాన్’

Follow us on