Araku: అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.

|

Sep 28, 2024 | 6:50 PM

అల్లూరి జిల్లా అరకు ఏజెన్సీలో సుడిగాలి బీభత్సం సృష్టించింది. పొలంలో ఉన్న నీటిని పైకి లేపి చక్కర్లు కొట్టింది. డుంబ్రిగూడ మండలం దేముడువలస- కొరొంజ్‌గూడ పొలాల్లో ఈ సుడిగాలి ప్రకోపం చూపింది. సుడిగాలి తీవ్రతను చూసి గిరిజనుల భయాందోళనకు గురయ్యారు. అయితే కాసేపటికి శాంతించడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఇదే సుడిగాలి.. భారీగా వస్తే దాన్నే టోర్నడో అంటారు.

అల్లూరి జిల్లా అరకు ఏజెన్సీలో సుడిగాలి బీభత్సం సృష్టించింది. పొలంలో ఉన్న నీటిని పైకి లేపి చక్కర్లు కొట్టింది. డుంబ్రిగూడ మండలం దేముడువలస- కొరొంజ్‌గూడ పొలాల్లో ఈ సుడిగాలి ప్రకోపం చూపింది. సుడిగాలి తీవ్రతను చూసి గిరిజనుల భయాందోళనకు గురయ్యారు. అయితే కాసేపటికి శాంతించడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఇదే సుడిగాలి.. భారీగా వస్తే దాన్నే టోర్నడో అంటారు. అయితే శక్తిమంతమైన టోర్నడోలు వస్తే తీవ్ర స్థాయిలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా వాటిల్లుతుంది. అమెరికాలో ఇలాంటి టోర్నడోలు మనుషుల్ని బలి తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మన దేశంలో భారీగా పర్వతాలు, ఎత్తైన కొండలు ఉండటం వల్ల టోర్నడోలు ఏర్పడే అవకాశం తక్కువ. టోర్నడోలు ఏర్పడాలంటే.. భారీగా చల్లని గాలులు రావాలి. అలాంటి గాలులు రాకుండా .. మన దేశ హిమాలయాలు అడ్డుకుంటున్నాయి. అందువల్ల భారత్‌లో టోర్నడోలు పెద్దగా రావు. ఇటీవల తెలంగాణాలోని ములుగు జిల్లాలో టోర్నడో తరహా గాలులు పెను బీభత్సం సృష్టించాయి. దీంతో ఏటూరు నాగరంలోని అటవీ ప్రాంతానికి తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వర్షంతో పాటుగా వీచిన ఈదురు గాలులతో 150 హెక్టార్లలోని 50 వేలకు పైగా చెట్లు నేలకొరిగాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on