స్కర్టులు ధరించి మెట్రోలో సందడి.. జనం ఎలా స్పందించారంటే ??

|

May 08, 2023 | 9:50 AM

ఢిల్లీలో మగవారు రొటీన్‌ డ్రెస్‌ కోడ్‌ను బ్రేక్‌ చేశారు. ప్యాంటుకు బదులు ఆడవారు ధరించే స్కర్టులు వేసుకుని మెట్రో రైలులో సందడి చేశారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. జండర్‌ డ్రెసింగ్‌కు సంబంధించి చాలా ఏళ్లుగా కొనసాగుతున్న మూస ధోరణిపై చర్చకు ఇది దారి తీసింది.

ఢిల్లీలో మగవారు రొటీన్‌ డ్రెస్‌ కోడ్‌ను బ్రేక్‌ చేశారు. ప్యాంటుకు బదులు ఆడవారు ధరించే స్కర్టులు వేసుకుని మెట్రో రైలులో సందడి చేశారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. జండర్‌ డ్రెసింగ్‌కు సంబంధించి చాలా ఏళ్లుగా కొనసాగుతున్న మూస ధోరణిపై చర్చకు ఇది దారి తీసింది. ఇద్దరు పురుషులు టీ షర్టులపై స్కర్టులు ధరించారు . ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో క్యాజువల్‌గా నడిచారు. మెట్రో రైలులో కూడా ప్రయాణించి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. సమీర్ ఖాన్‌ ఈ వీడియో క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా దీనికి నెటిజన్లు భిన్నంగా స్పందిస్తూ స్కర్టులు ధరించి మెట్రోలో ప్రయాణించిన ఆ ఇద్దరికీ మద్దతు తెలిపారు. లేడీస్ దుస్తుల్లో ఆత్మ విశ్వాసం, స్టైల్‌ వేరే లెవెల్‌లో ఉందంటూ ప్రశంసించారు. ‘అందరూ ఇలా ఎందుకు ధరించకూడదు?’ అని ఒకరు ప్రశ్నించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పట్టెడన్నం తిన్న విశ్వాసం.. 64 కి.మీ నడిచి యజమాని చెంతకు చేరిన శునకం

దోమల కోసం తిరుగులేని మాస్టర్ ప్లాన్.. చూస్తే షాకవ్వాల్సిందే

మన్యం గిరుల్లో వికసించిన అరుదైన పుష్పాలు

Samantha: సమంతపై టెన్నిస్‌ స్టార్‌ ప్రశంసలు.. ఎందుకంటే ??

Keerthy Suresh: ముఖంపై గాయాలతో మహానటి.. కీర్తి సురేష్‏కు ఏమైంది ??

Follow us on