Israel vs Maldives: భారత్‌ బీచ్‌లకు వెళ్లండి.! మాల్దీవుల బ్యాన్‌పై ఇజ్రాయెల్‌ కౌంటర్‌..

|

Jun 06, 2024 | 7:53 PM

పాలస్తీనా భూభాగంలోని హమాస్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తుంది. ఈ క్రమంలో పాలస్తీనా గడ్డపై సాధారణ పౌరులు కూడా సమిధలుగా మారుతున్నారంటూ అనేక దేశాలు ఇజ్రాయెల్ ను నిరసిస్తున్నాయి. ఈ క్రమంలో, ఇజ్రాయెల్ పౌరులు తమ దేశంలో పర్యటించడంపై మాల్దీవులు నిషేధం విధించింది. అయితే, మాల్దీవుల ప్రభుత్వ నిర్ణయానికి ఇజ్రాయెల్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది.

పాలస్తీనా భూభాగంలోని హమాస్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తుంది. ఈ క్రమంలో పాలస్తీనా గడ్డపై సాధారణ పౌరులు కూడా సమిధలుగా మారుతున్నారంటూ అనేక దేశాలు ఇజ్రాయెల్ ను నిరసిస్తున్నాయి. ఈ క్రమంలో, ఇజ్రాయెల్ పౌరులు తమ దేశంలో పర్యటించడంపై మాల్దీవులు నిషేధం విధించింది. అయితే, మాల్దీవుల ప్రభుత్వ నిర్ణయానికి ఇజ్రాయెల్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. తమ పౌరులు భారత్ లోని లక్షద్వీప్ వెళ్లాలని ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం ఓ ప్రకటన చేసింది.

ఇంతకీ ఆ ప్రకటనలో ఏముందంటే… “ఇకపై ఇజ్రాయెల్ దేశస్థులను అనుమతించబోమని మాల్దీవులు ప్రకటించింది. అందుకే మీ కోసం భారతదేశంలోని కొన్ని సుందరమైన బీచ్ ల వివరాలను అందిస్తున్నాం. ఈ భారత బీచ్ లలో ఇజ్రాయెల్ పర్యాటకులకు హార్దిక స్వాగతం లభిస్తుంది. అత్యంత ఘనమైన ఆతిథ్యం అందిస్తారు. ఇప్పటివరకు మన దౌత్యవేత్తలు పర్యటించిన ప్రాంతాల ఆధారంగా ఈ బీచ్ లను సిఫారసు చేస్తున్నాం” అంటూ భారత్ లోని ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం ట్వీట్ చేసింది. అంతేకాదు, లక్షద్వీప్, గోవా, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, కేరళ బీచ్ ల ఫొటోలను కూడా షేర్‌ చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on