సోదరి ఎగ్జామ్​ కోసం సాహసం.. మంచులో ‘రోడ్డు’ వేసిన సోదరుడు

|

Mar 11, 2024 | 4:56 PM

తన సోదరిని సమయానికి పరీక్షా కేంద్రానికి చేర్చేందుకు ఎవరూ ఊహించని సాహసమే చేశాడు ఓ సోదరుడు. ప్రధాన రహదారిపై 4 కి.మీల మేర పేరుకున్న మంచును 3:30 గంటలు కష్టపడి తొలగించాడు. దీంతో ఆ సోదరి 12వ తరగతి పొలిటికల్​ సైన్స్​ బోర్డ్​ ఎగ్జామ్ కోసం సరైన వేళకు వెళ్లి ఆ పరీక్షను​ రాయగలిగింది. ఈ అరుదైన ఘటన హిమాచల్​ ప్రదేశ్​ లాహౌల్​-స్పితి జిల్లాలోని ఓ గిరిజన గ్రామంలో జరిగింది. జిల్లాలో గత 3 రోజులుగా ఎడతెరపి లేకుండా మంచు కురుస్తోంది.

తన సోదరిని సమయానికి పరీక్షా కేంద్రానికి చేర్చేందుకు ఎవరూ ఊహించని సాహసమే చేశాడు ఓ సోదరుడు. ప్రధాన రహదారిపై 4 కి.మీల మేర పేరుకున్న మంచును 3:30 గంటలు కష్టపడి తొలగించాడు. దీంతో ఆ సోదరి 12వ తరగతి పొలిటికల్​ సైన్స్​ బోర్డ్​ ఎగ్జామ్ కోసం సరైన వేళకు వెళ్లి ఆ పరీక్షను​ రాయగలిగింది. ఈ అరుదైన ఘటన హిమాచల్​ ప్రదేశ్​ లాహౌల్​-స్పితి జిల్లాలోని ఓ గిరిజన గ్రామంలో జరిగింది. జిల్లాలో గత 3 రోజులుగా ఎడతెరపి లేకుండా మంచు కురుస్తోంది. భారీ మంచు కారణంగా ప్రధాన రోడ్లన్నీ దాదాపుగా మూసుకుపోయాయి. ప్రస్తుతం హిమాచల్​లో ఇంటర్మీడియేట్​ బోర్డ్​ పరీక్షలు జరుగుతున్నాయి. దీంతో మంచులోనే పరీక్షా కేంద్రాలకు వెళ్లి పరీక్షలు రాయాల్సి వస్తోంది. జిల్లాలోని గిరిజన ప్రాంతాల విద్యార్థులకు ఇది పెద్ద సవాలుగా మారింది. రిషిక గొంధా అనే యువతి 12వ తరగతి బోర్డ్​ పరీక్ష రాయాల్సి ఉంది. ప్రధాన రహదారి మొత్తం మంచుతో మూసుకుపోయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

200 సార్లు టీకా వేయించుకున్న వ్యక్తి.. పరీక్షించి షాక్‌ తిన్న శాస్త్రవేత్తలు

Follow us on