శబరిమల ఆలయంలో 4.5 కిలోల బంగారం మాయం వీడియో
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోని ద్వారపాలకుల విగ్రహాలపై ఉన్న 4.54 కిలోల బంగారం మాయమైన ఘటనపై కేరళ హైకోర్టు విచారణకు ఆదేశించింది. 2019లో మరమ్మతులకు తొలగించిన బంగారు తాపడాల బరువులో తేడాను గుర్తించి, విజిలెన్స్ అధికారులకు సమగ్ర విచారణకు ఆదేశించింది. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ద్వారపాలకుల విగ్రహాలకు చెందిన బంగారు తాపడాలలో 4.54 కిలోల బంగారం మాయమైన సంఘటనపై కేరళ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. 2019లో మరమ్మతుల కోసం తొలగించిన తాపడాల బరువు 42.8 కిలోలుగా నమోదు కాగా, మరమ్మతుల తర్వాత 38.28 కిలోలు మాత్రమే ఉండటంపై న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. 45 రోజుల తర్వాత చెన్నైలోని ఒక సంస్థకు తాపడాలను పంపడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైకోర్టు విజిలెన్స్ అధికారులకు సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధికారుల పాత్రపైనా అనుమానాలు ఉన్నాయి. ఈ కేసు విచారణను సెప్టెంబర్ 30కి వాయిదా వేసింది.
మరిన్ని వీడియోల కోసం :
రాజీనామాను ఆమోదించాలని ఎమ్మెల్సీ కవిత ఫోన్ చేశారు వీడియో
విమానంలో టీ కోసం గొడవ చెట్టంత మగాడిని చావబాదిన మహిళ వీడియో
సీనియర్ నటి రమాప్రభ అల్లుడు .. తెలుగులో తోపు హీరో.. ఫాలోయింగ్ ఎక్కువే వీడియో
సార్.. అమ్మ చదువుకోమంటోంది.. తల్లిపై ఫిర్యాదు చేసిన బాలుడు వీడియో
వైరల్ వీడియోలు
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
