మృగశిర ఎంట్రీ.. చేపలకోసం ఎగబడిన జనం.. ఎందుకనుకుంటున్నారా.?

Updated on: Jun 08, 2024 | 4:00 PM

మృగశిర కార్తెలో చేపలు తింటే మంచిదని తెలంగాణ ప్రజలు భావిస్తారు. ఇక మృగశిర ప్రవేశించే రోజునుంచే చేపలు కోసం ఎగబడతారు. ఈ క్రమంలో మత్స్యకారులు చేపలు పట్టేందుకు చెరువుల వద్దకు చేరుకున్నారు. మృగశిర కార్తెలో చేపలకు మంచి డిమాండ్‌ ఉంటుంది. దీంతో మత్స్యకారులు గురువారం రాత్రినుంచే చేపల చెరువులకు చేరుకున్నారు. తెల్లవారుజామును చేపలు నీటి పైకి ఆహారం కోసం వస్తాయి.

మృగశిర కార్తెలో చేపలు తింటే మంచిదని తెలంగాణ ప్రజలు భావిస్తారు. ఇక మృగశిర ప్రవేశించే రోజునుంచే చేపలు కోసం ఎగబడతారు. ఈ క్రమంలో మత్స్యకారులు చేపలు పట్టేందుకు చెరువుల వద్దకు చేరుకున్నారు. మృగశిర కార్తెలో చేపలకు మంచి డిమాండ్‌ ఉంటుంది. దీంతో మత్స్యకారులు గురువారం రాత్రినుంచే చేపల చెరువులకు చేరుకున్నారు. తెల్లవారుజామును చేపలు నీటి పైకి ఆహారం కోసం వస్తాయి. ఈ సమయంలో మత్స్యకారులకు చేపలు సులువుగా దొరుకుతాయి. దీంతో రాత్రి నుంచే చెరువుల వద్ద కాచుకున్నారు మత్స్యాకారులు. చేపలను పట్టుకొని అమ్మకానికి సిద్ధమయ్యారు.

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం తర్లపాడ్ గ్రామంలో చేపల చెరువు వద్ద చేపల కోసం పోటెత్తారు జనం. పోటీపడి మరీ చేపలను కొనుగోలు చేశారు. ఏకంగా చేపలకోసం క్యూలైన్లు ఏర్పాటు చేశారంటేనే అర్ధమవుతుంది.. మృగశిర కార్తలో చేపలకు ఉన్న డిమాండ్‌ ఏంటో. చేపలు తింటే కొన్ని అనారోగ్య సమస్యలు తగ్గుతాయని ఇక్కడివారు విశ్వసిస్తారు. అంతేకాదు ఆస్తమాకు మందును చేపలో పెట్టి ఇవ్వడం ఇక్కడి ఆనవాయితీ. ఈ చేపమందు కోసం రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలనుంచి ప్రజలు వచ్చి చేపమందును తీసుకుంటారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Loading...
Unable to load recommendations.
Follow Us