Kidney Viral Video: వీడెక్కడి డాక్టర్ అండి బాబు.. కిడ్నీలో రాళ్ళకు బదులుగా.. ఏకంగా కిడ్నీనే తీసేశారు..
ఉత్తర్ప్రదేశ్లో అనారోగ్య సమస్య వచ్చిందని ఆస్పత్రికి వెళ్తే.. కొత్త సమస్యను క్రియేట్ చేశారు వైద్యులు. కాస్గంజ్ జిల్లాకు చెందిన సురేశ్ చంద్ర హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విపరీతమైన బ్యాక్ పెయిన్ రావడంతో
ఉత్తర్ప్రదేశ్లో అనారోగ్య సమస్య వచ్చిందని ఆస్పత్రికి వెళ్తే.. కొత్త సమస్యను క్రియేట్ చేశారు వైద్యులు. కాస్గంజ్ జిల్లాకు చెందిన సురేశ్ చంద్ర హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విపరీతమైన బ్యాక్ పెయిన్ రావడంతో.. హాస్పిటల్కు వెళ్లాడు. పలు రకాల పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. అతడి ఎడమ కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు తేల్చారు. దీంతో ఏప్రిల్ 14న అలిగఢ్ హాస్పిటల్లో అతనికి కిడ్నీ ఆపరేషన్ చేశారు.అయితే అక్టోబర్ 29న అతడికి ఆకస్మాత్తుగా మళ్లీ కడుపు నొప్పి వచ్చింది. దీంతో ఆస్పత్రికి వెళ్లగా.. అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీశారు అక్కడి డాక్టర్లు. ఆపై డాక్టర్లు చెప్పిన విషయం విని సురేశ్ చంద్ర కంగుతిన్నాడు. రాళ్లను తొలగించేందుకు శస్త్రచికిత్స చేసేటప్పుడు అతడి కిడ్నీ రిమూవ్ చేశారు డాక్టర్లు. ఈ విషయం అతడికి గానీ, కుటుంబ సభ్యులకు గానీ తెలియదు. తాజాగా కడుపు నొప్పి రావడంతో రివీలయ్యింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేశాడు సురేశ్ చంద్ర.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్ కూడా..
Mobile Robbery: మొబైల్ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్ బ్లాకింగ్ సీన్..! ఇదే పనిష్మెంట్..
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం
మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !
ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి
దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్ చెప్పిందిలా..
తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్ చేస్తే..
అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే

